లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘బాహుబలి’ లైవ్ కన్సర్ట్ ముగిసింది అన్న వార్తలు వస్తున్నాయి.  చరిత్ర ప్రసిద్ధిగాంచిన 148 ఏళ్ల రాయల్ ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ కాకుండా మరో భాష సినిమాకు సంబంధించి లైవ్ కన్సర్ట్ జరగడం ఇదే తొలిసారి. అది కూడ ఒక తెలుగు సినిమాకు ఈ గౌరవం దక్కడంతో ఈ గౌరవం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. 

కీరవాణి ఆధ్వర్యంలో ‘బాహుబలి’ ది బిగినింగ్ కు సంబంధించిన స్కోర్ ను లైవ్ లో ప్రజెంట్ చేసి ఆ తరువాత ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శించడంతో విపరీతమైన స్పందన వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ మూవీ ప్రదర్శన మూసిన తరువాత లండన్ మీడియా రాజమౌళితో కొద్ది సేపు ప్రశ్న జవాబు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అని తెలుస్తోంది. 

లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ కకార్యక్రమం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ కు రాజమౌళి ప్రభాస్ అనుష్క రానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ను కలవడానికి జపాన్ నుంచి చాలామంది అభిమానులు ప్రత్యేకంగా లండన్ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అయితే ఈ కార్యక్రమంలో మీడియాకు పోజులు ఇచ్చే కార్య క్రమంలో ప్రభాస్ అనుష్కలు చాలా జాగ్రత్త పడినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ పక్కపక్కన నంచున్నప్పుడు లేక కూర్చున్నప్పుడు కొంచం గ్యాప్ పాటించి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో తమపై ఇక రానున్న రోజులలో గాసిప్పులు రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీడియాలో తమ పై వస్తున్న గాసిప్పులు చూసి అనుష్క ప్రభాస్ లు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో అన్న విషయం అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: