టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో నటించిన భరత్ అనే నేను, అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన మహర్షి సినిమాల వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. 

అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దానికి కారణం, అదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కాబోతుండడంతో, బన్నీ ఫ్యాన్స్ పేరుతో కొందరు పని గట్టుకుని మహేష్ బాబుపై విమర్శలు చేస్తున్నారని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే మహేష్ బాబు, బన్నీకి అడ్డుపడుతున్నారని, ఒకవేళ బన్నీ సినిమా సోలోగా సంక్రాంతి బరిలో నిలిస్తే ఆయనకు వచ్చే కలెక్షన్స్  అదిరిపోతాయని తెలిసి, దానిని నిరోధించడానికి మహేష్ ఈ విధంగా తమ సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు కొందరు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు వాస్తవం ఏంటంటే, నిజానికి రెండు సినిమాలు కూడా ఎప్పుడో సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమయ్యాయి అనే చెప్పాలి. 

అయితే రెండు సినిమాలకు కనీసం ఒక మూడు, నాలుగు రోజుల గ్యాప్ ఉంటుందని అందరూ భావించారు, అయితే అనూహ్యంగా ఒకే రోజున ఈ రెండు కూడా రిలీజ్ కు సిద్దమవుతాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఈ విషయమై కేవలం సూపర్ స్టార్ మహేష్ పై ప్రత్యేకంగా విద్వేషం పెంచుకుని తప్పుగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, నిజానికి గతంలో కొన్ని సందర్భాల్లో రెండు, మూడు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయి, రెండు కూడా మంచి విజయాలు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు సినీ విశ్లేషకులు. కాబట్టి ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించి ఆయా నిర్మాతలకు కాసులు కురిపించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: