టాలీవుడ్లో పలు చిత్రాలలో మెరిసి మెప్పించిన  హీరోయిన్ కేథరిన్. ముఖ్యంగా అల్లు అర్జున్ పక్కన ఇద్దరమ్మాయిలతో సినిమాలో  హీరోయిన్ గా అల్లు అర్జున్ సరసన నటించింది ... ఇక ఆ తర్వాత సరైనోడు సినిమాలో కూడా అల్లు అర్జున్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన గురించి ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేథరిన్ ట్రెసా తను కొంత కాలంగా ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది . ప్రస్తుతం ఆ వ్యాధి వల్ల ఏ  వాసన పసిగట్టే లేక పోతున్నాను అని చెప్పింది. 

 

 

 

 అనోస్మియా  అనే వ్యాధితో తాను  బాధ పడుతున్నట్లు తెలిపింది కేథరిన్ . ఈ వ్యాధితో బాధపడుతున్న వారు వాసన పసిగట్టే లేరని... దుర్వాసన సువాసన అయినా  పసిగట్టి లేరని కేథరిన్  చెప్పింది. అయితే ప్రస్తుతం తాను ఈ వ్యాధితో బాధపడుతుండడం వల్ల ఎలాంటి వాసనను పసిగట్టి లేక పోతున్నాను అని... కొంతకాలంగా ఈ సమస్య వెంటాడుతోంది అని చెప్పారు కేథరిన్ . అయితే ఈ వ్యాధి లక్ష  మందిలో ఒకరికి మాత్రమే ఉండే అరుదైన వ్యాధి అని... కాగా  ఈ వ్యాధి గురించి ఇప్పుడు వరకు ఎవరికీ చెప్పలేదని కేథరిన్ చెప్పింది.

 

 

 

 

 అయితే తాను ఈ వ్యాధి తో బాధపడుతూ వాసన పసిగట్టే లేకపోతుండడం వల్ల... ఈ సమస్య కారణంగా భవిష్యత్తులో పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఆమె . అయితే ఈ అమ్మడు   తెలుగు చాలా సినిమాలు చేసింది. కాగా ఈ అమ్మడికి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్లో ఇమేజ్  బాగా ఉండటంతో ...  అక్కడ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది కేథరిన్ . టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ ఫ్లవర్ అనే చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: