తెలుగులో ప్రస్తుతం హవా చూపిస్తున్న భామల్లో రష్మిక మందనా మొదటి వరుసలో ఉంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మహేశ్ తో సరిలేరు నీకెవ్వరులో నటిస్తోంది. ఛలో హిట్, గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అయితే ఇటివల ఆమె రెమ్యునరేషన్ విషయంలో సినిమాలు పోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

 


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా ఆల్రెడీ కన్ఫమ్ అయింది. దీనిని సినిమా టీమ్ కంటే ఓ ఛానెల్ ప్రకటించేసింది. అయితే ఆ సినిమా నుంచి రష్మిక తప్పుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్త అవాస్తమని తెలుస్తోంది. ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు ఆమె చెప్పిన రెమ్మునరేషన్ చూసి షాక్ అయి తానే తప్పించాడని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాకు రష్మిక రెండున్నర కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఈ విషయంలో అమ్మడు ఖచ్చితంగా ఉండడంతో దిల్ రాజుకు కోపం వచ్చిందని అంటున్నారు. హిట్లు, క్రేజ్, తొలినాళ్లలోనే సూపర్ స్టార్ సరసన అవకాశం.. ఇవన్నీ చూసే రష్మిక తన పారితోషికం పెంచేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ రెమ్యునరేషన్ తోనే ఓ హిందీ సినిమా కూడా వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 


డియర్ కామ్రేడ్ సినిమాకు క్రేజ్ రావడానికి విజయ్ దేవరకొండతో పాటు రష్మిక ఉండడమే. సినిమా ఫెయిలయినా రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో అల్లు అర్జున్ సరసన కూడా రష్మిక నటించబోతోంది. రెమ్యునరేషన్ విషయంలో రష్మిక డిమాండ్ నిజమే అయితే.. కొంత తగ్గితే మరిన్ని అవకాశాలతో టాప్ పొజిషన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: