తాను నటించిన చివరి సినిమా విడుదలైన సినిమా ‘నాపేరు సూర్య’ కెరియర్ పరంగా మరియు అభిమానుల పరంగా తీవ్రంగా నిరాశ పరచడంతో అల్లు అర్జున్ తన తర్వాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ‘అల వైకుంఠ పురంబులో’ అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎలాగైనా ఎక్కాలని తన సక్సెస్ జర్నీ కొనసాగించాలని మంచి కసి మీద ఈ సినిమా కోసం పని చేస్తున్నాడట బన్నీ. గతంలో త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు.


దీంతో చాలా కొత్తదనం కథతో ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా ఒక సాంగ్ తో సామజ వర గమన అనే సాంగ్ తో చాలా తెలివిగా సినిమా సినిమా యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాంగ్...సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తోంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో పాటుగా నటిస్తున్న అక్కినేని సుశాంత్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.


కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అధికారిక అప్డేట్ ను చిత్ర యూనిట్ వదిలారు.ఈ సినిమా నుంచి రెండో సాంగ్ తాలూకా టీజర్ ను విడుదల చేస్తామని తెలిపారు.దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.ఈ పోస్టర్ ను కనుక గమనించినట్లయితే క్లాస్ గా ఉంది కానీ సాంగ్ టైటిల్ ఏమో మాస్ గా కనిపిస్తుంది. మొత్తంమీద చూసుకుంటే మాస్ సాంగులతో అదిరిపోయే స్టెప్పులు వేసే అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: