అప్పట్లో తెలుగు సినిమా రంగంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఒక హీరోయిన్ గా క్యాథరిన్ ట్రెసా నటించడం జరిగింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయినా క్యాథరిన్ ట్రెసా తరువాత సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, పైసా సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తన యాక్టింగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా ప్రేమికులకు ఎంతో దగ్గరైన క్యాథరిన్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ కి పరిమితమయింది. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత తెలుగులో దూసుకుపోతున్న టాప్ హీరో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించడానికి రెడీ అయింది. నటనలో మంచి మెళకువ కలిగిన హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యాథరిన్‌ ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మరియు తన వ్యక్తిగత విషయాల గురించి అనేక విషయాలు తెలియజేస్తూ తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది.


ఇంటర్వ్యూలో క్యాథరిన్‌ మాట్లాడుతూ...తనకు అనోస్మియా అనే వ్యాధి ఉందని తెలిపింది. అనోస్మియా బాధితులు ఎలాంటి వాసనలు ఆఘ్రాణించలేరు. వారు మంచి వాసనలే కాదు, చెడు వాసనలు కూడా గుర్తించలేరు. వాసనలు గుర్తించే శక్తి వారిలో శూన్యం అని చెప్పాలి. ఈ జబ్బు కారణంగా పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నానని, అయితే సినిమాల్లో నటనకు ఈ లోపం అడ్డంకి కాదని భావిస్తున్నానని పేర్కొంది.


దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కెరియర్ పరంగా మంచి టైములో క్యాథరిన్ ట్రెసా కి ఇటువంటి వ్యాధి రావటం బాధాకరం అంటూ కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినా గాని సినిమాలు వదలను ప్రేక్షకులను అల్లరిస్తాను అని క్యాథరిన్ ట్రెసా చెప్పటం చాలా గర్వంగా ఉందని హీరోయిన్ గా క్యాథరిన్ ట్రెసా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: