టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా కొనసాగుతూ మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక తన కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఫస్ట్ సినిమా మీకు మాత్రమే చెప్తా, నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శత్వంలోను, అలానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనూ హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ, వాటితో పాటు అతి త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా నటించనున్నారు. 

కొద్దిరోజుల క్రితం ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇక ఇటీవల తన మీకు మాత్రమే చెప్తా సినిమా ట్రైలర్ ను తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ గారు రీరిలీజ్ చేయడంతో, ఆయనపై పొగడ్తలు కురిపించిన విజయ్, ఒకప్పుడు పోకిరి సినిమా థియేటర్స్ లో చూసి ఎంతో గోల చేశాను, ఆ విధంగా నా ఫేవరెట్ హీరో అయిన మహేష్ గారి సినిమాను తీసిన పూరి గారి దర్శకత్వంలో త్వరలో నేను నటించబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని మాట్లాడుతూ చెప్పారు. 

ఇకపోతే ఈ సినిమా మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, అంతేకాక హీరో క్యారెక్టరైజెషన్ పోకిరి లో మహేష్ పోషించిన పండు పాత్ర మాదిరిగా కొంతవరకు సాగుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక విజయ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ తన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి అపుడే హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలైందని, మరికొద్దిరోజుల్లో అన్ని వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని అంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: