క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా కొన్ని నెలల కిందట ‘హీరో’ పేరుతో బహు భాషా చిత్రం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేసారు. హీరో అన్న టైటిల్ తో మొదలుపెట్టిన  ఈమూవీ తొలి షెడ్యూల్‌ షూట్ చేసిన తరువాత రషెస్ చూసుకున్న విజయ్ ఈ మూవీ కథ పై అనుమానం కలిగి ఈమూవీని వదిలేసాడు అన్న వార్తలు వచ్చాయి. 

ఈమూవీకి సంబంధించి కేవలం 8 నిమిషాల స్కీన్ కు ఈ మూవీ దర్శకుడు ఆనంద్ అన్నామలై 15 కోట్లు ఖర్చు పెట్టించేయడంతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తే భారీ నష్టాలు తప్పవన్న ఉద్దేశంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని విజయ్ సలహాతో ఆపివేసారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికితోడు విజయ్‌ తో మైత్రీ మూవీస్ తీసిన ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ ఆగిపోయింది అన్న ప్రచారం కూడ జరిగింది.

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తూ మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం విజయ్ మళ్ళీ ఈ సినిమాను పున:ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తీయబోతున్న ఈమూవీ కోసం   విజయ్ ఇంటర్నేషనల్ రేసింగ్ ఛాంపియన్ రజని కృష్ణన్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్న నేపధ్యంలో ఈ మూవీని నవంబర్ లో ప్రారంభిస్తాడని తెలుస్తోంది.  

దీనితో తాను వదులుకున్న సినిమా పై విజయ్ ఎందుకు దృష్టి పెట్టాడు అంటూ చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. ఇది ఇలా ఉండగా విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ అంతా పూర్తి అయిపోయిన తరువాత ఆ మూవీ ప్రోడక్ట్‌ తన చేతిలో పెట్టాలని దానిని తన ఫ్యాన్స్‌కి నచ్చే రీతిలో మలచిన తర్వాతే మార్కెటింగ్‌ మొదలు పెడదామని విజయ్‌ ఈ మూవీ నిర్మాతకు చెపుతున్నట్లు టాక్. అంతేకాదు  అవసరమైతే ఈ మూవీకి రీషూట్స్‌ చేద్దామని విజయ్ చెపుతున్న మాటలకు ఈ మూవీ నిర్మాతలు భయపడి పోతున్నట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: