టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... వరుస విజయాలు సొంతం చేసుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలు ఎంచుకుంటూ... సంచలన విజయాలను అందుకుంటున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక ఊరి బాగు కోసం పోరాడే యువకుడిగా... రాష్ట్రాన్ని సరైన బాటలో నడిపే ముఖ్యమంత్రిగా... ఇక ఆ తర్వాత లక్ష్యం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన స్టూడెంట్ గా... ఇలా విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు మహేష్ బాబు . ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా  సరిలేరు నీకెవ్వరు సినిమాలో మొదటి సారి  మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. 

 

 

 

 

 ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయే. కాగా ఈ సినిమాలో పదమూడేళ్ల తర్వాత డైనమిక్ నటి  విజయశాంతి మరోసారి ఓ ముఖ్య పాత్రలో నటించనుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ చిత్రబృందం  విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారి  ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే దీపావళి సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు చిత్రబంధం దీపావళి కానుక ఇవ్వనున్నారు. 

 

 

 

 

 ఇక దీపావళి సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం ఓ ప్రత్యేక కానుక సిద్ధం చేశారు చిత్రం బృందం. ఈ విషయాన్ని తెలుపుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. మీ అభిమాన నటుడు మహేష్ బాబు  నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి దీపావళి ట్రీట్ కి రెడీ గా ఉండండి అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. అభిమానులకు దీపావళి సందర్భంగా మహేష్ బాబు చిత్రబృందం ఇచ్చే గిఫ్ట్  ఏంటా అని అందరూ ఆలోచనలో పడ్డారు. కాగా ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: