మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు మరియు రామ్ చరణ్ భార్య అయిన కొణిదెల ఉపాసన, ఎప్పటికపుడు తన లైఫ్ స్టైల్ మరియు ఫ్యామిలికి సంబందించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాక ఆమెకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలతో మంచి అనుబంధం ఉంది. ఇకపోతే నిన్న, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ సినిమా ప్రముఖులతో కలిసి గాంధీ మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి విందును కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈవారికీ  వేడుకకు షారుఖ్, అమిర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ నటులు హాజరయి, వేడుకను ఎంతో జయప్రదం చేసారు. 

అంతేకాక షారుఖ్ మరియు అమీర్ ఖాన్ ల స్పీచ్ అందరిని ఎంతో అలరించింది. అయితే ఈ విషయమై మెగాస్టార్ కోడలు ఉపాసన గారు, తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ, నరేంద్ర మోడీ గారు మీరు మన దేశానికి ప్రధానిగా ఉండడం మా అందరికీ ఎంతో గర్వ కారణం, అంతేకాక మీరు నార్త్ సినిమా నటులకు ప్రత్యేకంగా ఇచ్చిన విందుకు మేము అందరం ఎంతో సంతోషిస్తున్నాము. అయితే వారితో పాటు మా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా అనేకమంది దిగ్గజ నటులు ఉన్నారు. దయచేసి మీరు ఆ విషయాన్ని గుర్తించండి, ఈ విధంగా కేవలం బాలీవుడ్ నటులను మాత్రమే ప్రత్యేకంగా కలవడం ఎంతవరకు సమంజసం అంటూ నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేస్తూ ఉపాసన ఒక పోస్ట్ చేయడం జరిగింది. 

అయితే నిన్న ఉపాసన పెట్టిన ఆ పోస్ట్ కు పలువురు సౌత్ ప్రజలు ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు. మేడం మీరు నిజంగా ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి మన సౌత్ ప్రేక్షకుల మరియు నటుల గొప్పతనం గురించి ప్రధాని గారికి తెలిసేలా గొంతెత్తి మాట్లాడారు. అందుకు మీకు కృతజ్ఞతలు, మీ వినతిని ప్రధాని మోడీ గారు తప్పకుండా స్వీకరిస్తారని ఆశిస్తున్నాం అంటూ పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: