సూపర్ స్టార్
మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు మీకెవ్వరు మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆ మూవీ సంక్రాంతికి థియేటర్ల లోకి వస్తుంది. ఆ మూవీ తరువాత నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఇటు ఫ్యాన్స్ లోనూ, అటు ఇండస్ట్రీలోనూ కూడా ఉంది.
మహేష్ దిల్ రాజు,
వంశీ పైడిపల్లి కాంబో ఓ వైపు ఉంది. అయితే
మహేష్ బాబు మాత్రం
వంశీ పైడిపల్లి కంటే ముందే మరో మూవీకి కమిట్ అయ్యాడని అంటున్నారు.
అదే కేజీఎఫ్ మూవీతో సంచలనం రేకెత్తించిన
ప్రశాంత్ క్రేజీ డైరెక్టర్
ప్రశాంత్ నీల్ కాంబోలో
మహేష్ తరువాత మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయ్.
మహేష్ వంశీ పైడిపల్లి మూవీకి కధ ఇంకా కసరత్తు జరుగుతోంది. అది ఫైనల్ స్టేజ్ కి రావాలంటే మరో నాలుగైదు నెలలు సమయం పట్టే చాన్స్ ఉందిట. ఈ లోగా
ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాలని
మహేష్ భావిస్తున్నాడుట.
మహేష్ నుంచి ఫోన్ రావడంతో
ప్రశాంత్ నీల్ సూపర్ స్టార్ తో కొత్త మూవీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. నాలుగైదు నెలల్లో మూవీని చేసి సమ్మర్ కి ఈ మూవీని రిలీజ్ చేయాలని
మహేష్ అనుకుంటున్నారని టాక్. ఏది ఏమైనా
మహేష్ దూకుడుగానే ఉన్నారు. వరసగా సినిమాలు చేయాలనుకుంటున్నారుట. ముందు ఎవరు కధ చెబితే వారి మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. దాంతో ఈ లక్కీ చాన్స్ కధ మొత్తం సిద్ధం చేసుకున్న ప్రశాంత్ నీల్ కి వచ్చిందని అంటున్నారు. కేజీఎఫ్ తో పెద్ద హిట్ కొట్టిన
ప్రశాంత్ కి సూపర్ స్టార్ దొరికాడు, మరి ఈ క్రేజీ కాంబో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.ఏది ఏమైనా లక్కీ చాన్స్
ప్రశాంత్ కొట్టేశాడంటున్నారు.