ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ తర్వాత వచ్చి గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఈ సినిమా లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా హీరో, హీరోయిన్లు ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే  గీత గోవిందం సినిమా తర్వాత ఆమెకు పెద్ద ఆఫర్లే వచ్చాయి. నాగార్జున, నాని మల్టీ స్టారర్లుగా చేసిన "దేవదాసు" చిత్రంలో నటించింది.


ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రష్మికకి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్న ఆమె అతి వల్ల ఆ అఫర్లు కోల్పోతుంది. దానికి కారణం ఆమె అమాంతం తన రెమ్యునరేషన్ ని పెంచడమే. తెలుగు, తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో ఒక్కసారిగా పారితోషికం పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారట.


దిల్ రాజు తన సినిమాలో హీరోయిన్ కోసం రష్మికని సంప్రదించాడట. నాగచైతన్య హీరోగా శిశి అనే కొత్త దర్శకుడితో దిల్ రాజు చేయాలనుకున్న సినిమాకు రష్మికను అనుకున్నారట. రెండు సార్లు ఆమెకు కథను కూడా దర్శకుడు శశి చెప్పాడట. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రష్మికను పారితోషికం విషయంలో దిల్ రాజు పక్కకు పెట్టేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇంతకుముందు జెర్సీ హిందీ రీమేక్ కోసం రష్మిక ని సంప్రదిస్తే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందన్న కారణంగానే పక్కన పెట్టేశారట. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఇకనైనా తన పద్దతి మార్చుకోకపోతే మరిన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: