పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయారు. రేణు దేశాయ్ కి భరణం గా పవన్ 40 కోట్లకు పైగా చెల్లించాడు. డబ్బు కోసం పవన్ తన ఫార్మ్ హౌస్ ని కూడా అమ్మేసారు. పవన్ హైదరాబాద్ లో సినిమాలతో బిజీ గా ఉంటె రేణు పూణే కి వెళ్ళిపోయింది. పిల్లలు ఇద్దరి దగ్గర కొంత కాలం ఉంటారు. ఇవన్నీ ఒకప్పుడు పవన్, రేణు వివాహ బందం గురించి వచ్చిన పుకార్లు, గాలి వార్తలు. మరి అప్పుడు అలా రాసిన వాళ్ళు ఇప్పుడెం రాస్తారో ? విషయం ఏంటంటే పవన్, రేణు దేశాయ్ ఇద్దరు విడిపోలేదు. రేణు దేశాయ్ తన మాతృభాష లో సినిమా తీయాలని నిర్ణయించుకొని, పవన్ ని అడిగితే ఆయన ప్రోత్సహించారట. రేణు దేశాయ్ మొట్ట మొదటి సారిగా నిర్మాత గా మారి నిర్మించిన మరాటి సినిమా ‘మంగలాష్టక్ ఒన్స్ మోర్’ ఇటీవలే విడుదల అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో ‘పవన్ నాకు ఎప్పుడు తోడుగానే ఉంటారు, ఆయన చాల పెద్ద వ్యక్తీ, అయన వల్లనే నేను ఈ సినిమాని నిర్మించాగలిగాను, నా భార్య మిమ్మల్ని కలవటానికి వస్తుంది అంటూ సిఫార్సులు చేయరు, స్టొరీ, స్క్రిప్ట్, మ్యూజిక్ ఇలా సినిమాకు సంబందించిన ప్రతీ విషయం ఆయన వలనే నేర్చుకున్నాను, నేను గాడి తప్పకుండా ఎప్పుడు నన్ను కనిపెట్టుకుంటారు’ అంటూ భర్త మీద అభిమానాన్ని చాటి చెప్పింది రేణు. తనకు ఏంతో ఇష్టమైన మంగలాష్టక్ సినిమాని ఈ తరానికి మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో రీమేక్ చేసిందట, నటులు, సంగీతం, లొకేషన్స్ అన్నిటిని తనే స్వయంగా దగ్గరుండి చూసుకుందట, ఇంతగా కష్టపడి నిర్మాతగా నిర్మించిన తన మొదటి సినిమా విజయం సాధించినందుకు చాల సంతోషంగా ఉంది రేణు. మన పవన్ భార్య రేణు దేశాయ్ ఇలానే మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: