బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి'లో విభిన్నమైన వ్యక్తులు.. విభిన్నమైన తమ వ్యక్తిగత జీవితాలను వెల్లడిస్తుంటారు. తాజాగా అలాంటి భావోద్వేగమైన ఘటన ఒకటి బిగ్ బి షోలో అందరికీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన అందరి గుండెలు బరువెక్కేలా చేసింది. కేబీసీలో ప్రసారమైన ఈ కథనం బిగ్ బి అమితాబ్ నే కాకుండా బాలీవుడ్ సినీ తారలను కూడా ఓ తెలుగు మహిళ విషాదగాథ కదిలించింది. 

తెలుగు మహిళ - పద్మ భూషన్ సునీత కృష్ణన్ మానవ అక్రమ రవాణాను రక్షించే బాధ్యతలు చేపడుతూ సామాజిక కార్యకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా కేబీసీలో అమితాబ్ ముందుకు కంటెస్టెంట్ గా వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీత తన జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన గ్యాంగ్ రేప్ సంఘటనను ను చెప్పి అమితాబ్ బచ్చన్ ను కంటతడి పెట్టించింది. ఈ సంఘటన విన్న అమితాబ్ గుండె బరువెక్కి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తన యుక్త వయసులో ఆరుగురు వ్యక్తుల చేతిలో తను గ్యాంగ్ రేప్ నకు గురయ్యాననే విషయాన్ని చెప్పి అంతటితో కంటతడి పెట్టించింది. అమితాబ్ ఈ మాటలను విని భావోద్వేగానికి గురయ్యారు. ఇక తను వెధవల బారిన పడకుండా ఎలా చర్యలు తీసుకుంటాననే విషయం బిగ్ బికి చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశారు. అంతేకాదు సునీత ఓ సెక్స్ రాకెట్ లో మూడేళ్ల బిడ్డను ఒక యువతిని రక్షించిన విషయంలో కూడా బిగ్ బి చాలా ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ ఎపిసోడ్ ను చూసిన బాలీవుడ్ తార అనుష్కశర్మ కూడా చాలా ఆవేదనకు గురైంది. ట్విట్టర్ లో ప్రస్తావించి షాక్ కు లో ఉండిపోయింది. మూడేళ్ల చిన్నారి సెక్స్ ట్రాఫికింగ్ గురికావడం అత్యంత దయనీయం దారుణం అని అనుష్క ట్వీట్ చేశారు. నిజంగా మహిళల పట్ల ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతో బాధాకరం అని ఈ సంఘటన విన్న అందరు అభిప్రాయపడుతు తమ సానుభూతి తెలుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: