గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 న మెగాస్టార్ సైరా, హాలీవుడ్ మూవీ జోకర్ తో పాటు భారీ అంచనాల మధ్య విడుదలైన బాలీవుడ్ క్రేజీ మూవీ 'వార్'. ఈ సినిమా కు ముందు అన్ని చోట్లా నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అంతేకాదు కొందరు నెగటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. కాని కలెక్షన్స్ చూస్తే సూపర్ హిట్ సినిమా రేంజ్ లో వస్తు మైండ్ బ్లాక్ చేస్తోంది. విడుదలైన హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో ఇదే టాప్ ప్లేస్ లో చేరబోతుందని తెలుస్తోంది. ఈ ఆదివారం వరకు కలెక్షన్స్ చూస్తే 301.5 కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టిందట.

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో దాదాపుగా 170 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన రోజు ఈ సినిమా బడ్జెట్ రికవరీ చేస్తుందా అనే అనుమానాలు అందరిలోను కలిగాయి.  కాని సినిమా మొదటి వీకెండ్ లోనే 100 కోట్లను క్రాస్ చేయడంతో అందరు షాకయ్యారు. ఇప్పుడు 300 కోట్లు వసూళ్లు చేయడంతో బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లు అదే షాక్ కి గురయ్యారు. అనూహ్యంగా ఇంత భారీ కలెక్షన్స్ ఎలా సాధ్యమయ్యాయని అనుకుంటున్నారట. షాహిద్ కపూర్ కబీర్ సింగ్ లా కలెక్షన్స్ ని యమా స్పీడ్ గా రాబట్టిందని ఆశ్చర్యపోతున్నారట. ఇక హృతిక్ రోషన్ కైతే చాలాకాలం తర్వాత పెద్ద బ్లాల్ బస్టర్ హిట్ పడింది. 

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది యశ్ రాజ్ ఫిల్మ్స్ కు అమితాబ్, అమీర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఆ నష్టాలను ఈ సినిమా పూడ్చడంతో పాటు భారీగా లాభాలను కూడా తెచ్చి పెట్టిందంటూ బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం 'వార్'కు వచ్చిన స్పందనతో త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ని రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా లేటెస్ట్ న్యూస్. అయితే ఈ సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ కాకుండా హృతిక్ రోషన్ తో మరో యంగ్ హీరో  నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: