సినిమాల నుండి రాజకీయలలోకి వెళ్ళి మంత్రి స్థాయి వరకు ఎదిగిన
బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాల కొనసాగుతున్నా ఎటువంటి గుర్తింపు లేని స్థాయిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో
బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్
చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య చిచ్చు పెట్టాయి.
మెగా స్టార్ గా కోట్ల మంది అభిమానం పొందిన
చిరంజీవి వేసే స్టెప్స్ తో పాటు అతడు చేసే గుర్రపు స్వారీకి కూడా మంచి పేరు ఉంది. ‘కొదమసింహం’ ‘కొండవీటి దొంగ’ లాంటి సినిమాల నుండి లేటెస్ట్ గావిడుదలైన ‘సైరా’ వరకు చిరంజీవి అద్భుతంగా గుర్రాన్ని నడిపిస్తూ గుర్రపుస్వారీలో కూడ తనకంటూ ఒక స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇలాంటి
చిరంజీవి గురించి
బాబు మోహన్ యధాలాపంగా చేసిన కామెంట్స్
చిరంజీవి బాలయ్యల అభిమానుల మధ్య చిచ్చు పెట్టాయి. బాలకృష్ణ గుర్రపు సవారీలో నెంబర్ వన్ అని చెపుతూ
బాబు మోహన్ ‘బాలయ్య వేరు అసలు చిరంజీవి గిరంజీవి ఎవరు ఆయన ముందు సరిపోరు’ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారి
చిరంజీవి అభిమానుల టార్గెట్ లో
బాబు మోహన్ ఉన్నాడు.
వాస్తవానికి
బాబు మోహన్ బాలకృష్ణలు కలిసి ‘భైరవ ద్వీపం’ మూవీలో నటించారు. ఆ సినిమా షూటింగ్ లో బాలయ్య గుర్రపు స్వారీ ప్రతిభను దగ్గర నుండి చూసి ఇలా
బాబు మోహన్ కామెంట్స్ చేసి ఉంటాడు అని కొందరు భావిస్తున్నారు. గతంలో కూడ శోభన్ బాబు చనిపోయినప్పుడు
బాబు మోహన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పట్లో దాసరి చేత చివాట్లు తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ బాలయ్యను మెచ్చుకుంటూ చిరంజీవి సమర్థత పై నెగిటివ్ కామెంట్స్ చేయడం బట్టి గతంలో
చిరంజీవి బాబు మోహన్ ల మధ్య ఏదైనా గ్యాప్ ఉందా అని అనిపించడం సహజం..