ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-3 చివరి దశకు చేరుకుంది. విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని 14 వారంలోకి అడుగుపెట్టింది. ఇక 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన షో లో ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ ఆరుగురిలో చివరి వారంలో ఎవరు హౌస్లో ఉంటారు ? ఎవరు బయటకు వెళతారు ? అన్నది సస్పెన్స్గా ఉంది. ఫైనల్స్లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు.
ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో వీక్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఎక్కువుగా ఉంది. వాస్తవంగా చూస్తే
అలీ రెజా, శివజ్యోతి వీక్గా ఉన్నారు.
అలీ రెజా ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి, మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అలీకి బయట పరిస్థితులు తెలుసుకుని
గేమ్ ఆడతాడన్న అభిప్రాయం బయట జనాలకు కూడా అర్థమైంది.
అయితే తాజాగా ఇచ్చిన ఎలిమినేషన్ ప్రక్రియలో
అలీ డైరెక్టుగా ఫినాలేకు వెళ్లే రేసులో ముందున్నట్టే కనపడుతోంది. ఎందుకంటే వాళ్లకు ఇచ్చిన బ్యాటరీల్లోని చార్జింగ్ పర్సంటేజ్ చూసినా అందరికంటే ఎక్కువుగా అలీకి వచ్చింది. వాళ్లకు ఇచ్చిన బ్లాక్ ల్లో అలీకి 70%, శివజ్యోతి-60 %, శ్రీముఖి-50%, రాహుల్-50%, బాబా భాస్కర్-40%, వరుణ్-40% అనే బోర్డులు వచ్చాయి.
ఇక
అలీ ముందు అరటి పండ్లు తినే టాస్క్లో శివజ్యోతిని ఓడించి తన చార్జింగ్ పర్సంటేజ్ను 10 % పెంచుకున్నాడు. ఇక రెండోసారి బాబాను సైతం పూలమొక్కలు పీకేసే టాస్క్లో గట్టిగా ఢీకొట్టి చాలా కసితో
గేమ్ ఆడినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే రెండు టాస్క్ల్లో గెలవడంతో పాటు ముందుగా అతడికి మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఎక్కువుగా 70 % రీచార్జ్ పవర్ రావడంతో
అలీ డైరెక్టుగా ఫినాలేకు వెళ్లిపోనున్నాడు. ఇక మిగిలిన ఐదుగురిలో వీక్ శివజ్యోతి కాబట్టి ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి.