యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నటించిన సాహో బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే ఇంకా బాహుబలి మ్యానియానే ప్రభాస్ చుట్టూ నడుస్తున్నట్టు ఉంది. అందుకే సాహో బాలీవుడ్ లో తప్ప మరెక్కడా ఆడలేదు. కానీ.. ఇక మీదట ప్రభాస్ చేసే సినిమాలన్నీ బాలీవుడ్ లో కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్ లో నటిస్తున్న ప్రభాస్ తర్వాత చేయబోయే సినిమాపై టాలీవుడ్ లో పలు వార్తలు షికారు చేస్తున్నాయి.

 


గీత గోవిందంతో కేరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ స్టోరీ లైన్ ను యూవీ క్రియేషన్స్ కు వినిపించనున్నాడని టాక్. యూవీ నుంచి పిలుపు రావడంతో పరశురామ్ తన దగ్గరున్న స్టోరీ లైన్ ను ప్రిపేర్ చేస్తున్నాడని అంటున్నారు. నిజానికి గీత గోవిందం లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరక్టర్ గా వరుస అవకాశాలు రావాల్సింది పోయి ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. మధ్యలో మహేశ్ తో సినిమా అనుకున్నా మహేశ్ కమర్షియల్ స్ట్రాటజీలో పరశురామ్ కు అవకాశం రాలేదు. అలాంటిది తన ప్రమేయం లేకుండా యూవీ నుంచి కాల్ రావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరశురామ్ భావిస్తున్నాడట.

 

 

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవుతుంది. దీని తర్వాత ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాపై అనేక ఊహాగానాల్లో ఇదొకటి. రాజమౌళితో సినిమా చేస్తున్నాడని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. మరి ప్రభాస్ జాన్ తర్వాత చేయబోయే సినిమా పరశురామ్ దే కానుందా అనేది చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: