ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ త్రీ రియాల్టీ షో కి యాంకర్ గా రాణిస్తున్న నాగార్జున చివరిగా నటించిన మన్మధుడు సీక్వెల్ సినిమా మన్మధుడు 2 దారుణంగా ఫ్లాప్ కావడంతో తన తర్వాత సినిమా కోసం త్వరలోనే నాగార్జున కీలక ప్రకటన చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ప్రస్తుతం నాగార్జున యాంకర్గా చేస్తున్న బిగ్ బాస్ షో దాదాపు చివరి దశకు వచ్చేయడం జరిగింది. మరో రెండు వారాల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరు అన్నది తెలిసిపోతుంది. దీంతో నాగార్జున తన తర్వాతచేయబోయే సినిమా కి సంబంధించిన కథ స్క్రిప్టు విషయంలో ఇప్పటి నుండి పనులు స్టార్ట్ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


దీంతో సోగ్గాడే చిన్నినాయన అనే సినిమా సీక్వెల్ చేయటానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ అయినా హిందీ రీమేక్ సినిమా పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా రెయిడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నాగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే ఆ సినిమా దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు.


ఇక సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు  స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ కోసం నటీనటులను అలాగే ఇతర విభాగాల్లో టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు సూపర్ డూపర్ హిట్ అవడానికి అయితే సీక్వెల్ లేకపోతే రీమేక్ ఫార్ములానే నమ్ముకున్న ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాకి సీక్వెల్ చేయటానికి నాగార్జున ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నారని ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: