మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా ఇటీవల రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న చిరంజీవి మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కొన్ని రికార్డులు సృష్టించింది. ఈ సందర్భంగా సినీ నటుడు రాజకీయ నాయకుడు కమెడియన్ బాబు మోహన్ ఈ సినిమాలో చిరంజీవి గుర్రపు స్వారీ చేయడం గురించి మరియు చిరంజీవి ని పోలుస్తూ నందమూరి బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్ చేశారు. విషయంలోకి వెళితే సైరా సినిమాలో చిరంజీవి గుర్రపుస్వారీలో తన నైపుణ్యాన్ని చూపించడం జరిగింది. చాలామంది 64 వయసులో కూడా చిరంజీవి అద్భుతంగా గుర్రం పై స్వారీ చేశారని కామెంట్లు చేశారు ఇండస్ట్రీలో ఉన్నవారు.


దీంతో చిరంజీవి బాగా గుర్రపుస్వారీ చేయడం గురించి బాబు మోహన్ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో బాబుమోహన్ తన ఆఫీసు లో క్యాజువల్ గా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గుర్రపుస్వారీ నైపుణ్యం గురించి చెప్పుకొచ్చారు.


బాబు మోహన్ మాట్లాడుతూ...‘‘భైరవద్వీపం సినిమాలో బాలకృష్ణ, నేను గుర్రం మీద వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు గుర్రం నడపడంలో. ఆడతాడు గుర్రాలతో. ఎగిరి దూకుతుంటాడు. నిజంగా.. బాలకృష్ణ లాగా ఎవ్వరూ.. చిరంజీవి గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడపజాలరు. ఏం పట్టుకోకుండా... కేవలం జూలు మాత్రమే పట్టుకుని పోతుంటాడు’’ అంటూ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు బాబూ మోహన్. దీంతో బాబు మోహన్ కి మెగా అభిమానులు అప్పట్లో చిరంజీవి నటించిన కొదమసింహం కొండవీటి వంటి సినిమాలలో స్టైల్ గా ఏ విధంగా గుర్రాన్ని నడిపారో వంటి విషయాలు గుర్తు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో ఇది తన అభిప్రాయం మాత్రమే అని చివర్లో బాబు మోహన్ పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: