తెలుగు ప్రజలందరిని భారీగా అలరిస్తున్న షో  బిగ్ బాస్  తెలుగు సీసన్ 3. తెలుగు టెలివిజన్ లోనే  బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమై తెలుగు ప్రేక్షకులను టీవీలకే  కట్టిపడేస్తుంది. సెలబ్రిటీల రియల్ లైఫ్ ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ  అందరిని ఆకర్షిస్తుంది. కాగా  17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం 13 వారాలు ముగించుకొని 14వ వారం లోకి అడుగుపెట్టింది... మరో రెండు వారాల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. అయితే బిగ్ బాస్ షోలో నామినేషన్లు ఎలివేషన్లు కామనే. ప్రతివారం నామినేషన్లు... వారంతంలో నాగార్జున వచ్చి సభ్యుల్లో ఒకరిని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్  రూల్. అయితే తాజాగా మొన్న ఆదివారం హౌస్ నుండి బయటకు వచ్చింది వితిక. 

 

 

 

 

 ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. బాబా భాస్కర్,  శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,  వరుణ్ సందేశ్,  శివజ్యోతి ఆలీ రజా ఈ ఆరుగురు సభ్యులు మాత్రమే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. అయితే మొన్న ఆదివారం  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వితిక  బిగ్ బాస్  హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితిక... బిగ్ బాస్  హౌస్ గురుంచి  చాలా విషయాలు పంచుకుంది. అయితే బిగ్ బాస్ షో లో రాహుల్ ఎలాంటివాడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వితిక సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

 

 

 

 రాహుల్ ఆశావాది అంటూ బాంబు పేల్చింది వితిక. మొదట తమతో బాగానే ఉండేవాడని చివరికి వచ్చేసరికి తమతో సరిగ్గా మాట్లాడడం మానేసాడు అని... ఒంటరిగానే ఉంటున్నాడు అని పేర్కొంది. అయితే ప్రస్తుతం వితిక  కామెంట్స్ పై రాహుల్  సిప్లిగంజ్  అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు బ్రదర్ బ్రదర్ అంటూ రాహుల్ తోనే ఉన్న వితిక  బయటకు వచ్చాక ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాహుల్ కి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నందున... ఈర్ష్య తోనే  ఇలా మాట్లాడుతుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా వితిక  వెన్నంటే ఉండి ఎన్నో టాస్క్ లు  గెలిపించిన రాహుల్ గురించి వితిక బయటకు వచ్చాక ఇలా మాట్లాడడంతో  షాక్ అవుతున్నారు కొంతమంది అభిమానులు నెటిజన్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: