హీరో విక్రమ్ ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు. విభిన్నమైన కథలోని ఎంచుకుంటూ  ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నాడు హీరో విక్రమ్. అంతే కాకుండా తన దగ్గరికి వచ్చే సినిమాలన్ని  కూడా ప్రయోగాత్మక సినిమాలు ఉంటాయి. సినిమాలో పాత్ర కోసం తన బాడీ ని ఎలాగైనా మలుచుకోగల హీరో విక్రమ్. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో  నటించి మరెన్నో విజయాలను అందుకున్నారు. కాగా ప్రస్తుతం విక్రమ్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన తనయుడు ధృవ్  కూడా సినిమాలకి పరిచయం కాబోతున్నాడు. 

 

 

 

  సాదా సీదా సినిమాగా  విడుదలై తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసింది అర్జున్ రెడ్డి. అయితే ఈ సినిమాను ఇప్పటికే బాలీవుడ్ లో  కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగ  అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాని విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా  ఆదిత్య వర్మ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారూ. వచ్చేనెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి  సినిమానే తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సరైన సినిమా అని భావించి విక్రమ్ ఈ సినిమాని ధృవ్  తో తెరకెక్కిస్తున్నారు. 

 

 

 

 అయితే తాజాగా ఈ సినిమా చెన్నైలో ఆడియో వేడుక జరుపుకుంది. అయితే ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేష్ మెహత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ధృవ్  పక్కన బనితా సందు  నటిస్తుంది . అయితే తాజాగా జరిగిన ఆడియో వేడుకలో మాట్లాడిన నిర్మాత ముఖేష్ మెహత ఓ ప్రకటన చేశారు. తమ బానర్లో  విక్రమ్ ఆయన తనయుడు ధృవ్  హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ఉంటుందని 2021-22 మధ్యలో ఈ ప్రాజెక్టు మొదలవుతుందని  ఆయన చెప్పారు. అయితే ముఖేష్ మెహతా ప్రకటనతో విక్రం అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. తండ్రి కొడుకులను ఒక స్క్రీన్ పై చూడడం కంటే ఇంకేం కావాలి అని మురిసిపోతున్నారు. అంతేకాకుండా విక్రమ్ తనయుడు చేస్తున్న మొదటి సినిమా ఆదిత్య వర్మ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: