2015లో ఓంకార్ దర్శకుడిగా ఆయన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా వచ్చిన రాజు గారి గది సినిమా, అప్పట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయి, పెద్ద విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా రాజు గారి గది 2 సినిమాను నాగార్జున మరియు సమంత ప్రధాన పాత్ర ధారులులుగా తెరకెక్కించిన ఓంకార్, ఆ సినిమాతో యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా ఆయన తెరకెక్కించిన రాజు గారి గది 3 సినిమా పర్వాలేదనిపించేల యావరేజ్ టాక్ తో ముందుకు సాగుతోంది. 

ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కమెడియన్ అలీ, శివ శంకర్ మాస్టర్, గెటప్ శ్రీను, హరితేజ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించడం జరిగింది. ఇక తమ సినిమాను మంచి టాక్ రావడంతో, నిన్న ఈ సినిమా సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ మాట్లాడుతూ, తనకు రాజు గారి గది సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఎంతో నచ్చాయని, ఇక ప్రస్తుతం తెరకెక్కిన ఈ మూడవ భాగంలో తాను కూడా నటించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆలీ. నిజానికి సినిమాకు చాలా చోట్ల నుండి మంచి టాక్ వస్తుంటే, 

ఇండస్ట్రీలోని కొందరు మాత్రం కావాలని పనిగట్టుకుని మరీ సినిమాకు నెగటివ్ టాక్ తీసుకువస్తున్నారని, సినిమా చూడని ప్రతి ఒక్కడు, ఇష్టం వచ్చిన విధంగా కామెంట్స్ చేయడం, అసలు ఆ విధంగా కామెంట్స్ చేయడానికి నువ్వు ఎవడివిరా అంటూ నెగటివిటీ చేసేవారిపై తనదైన రేంజ్ లో విరుచుకుపడ్డారు ఆలీ. సినిమాకు వస్తున్న టాక్ తో టీమ్ మొత్తం ఎంతో సంతృప్తిగా ఉన్నామని, దయచేసి మంచి సినిమాను బ్రతకనివ్వండి అంటూ ఆయన మాట్లాడుతూ చెప్పారు. కాగా ఆలీ విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: