బిగ్ బాస్ లో సాధారణంగా గొడవలు జరగడం చాలా సార్లు చూశాం. అయితే ఏరోజూ ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు పొట్లాడిన సందర్భాలు లేవు. అయితే మొదటిసారి ఆలీ దాన్ని బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. దానివల్ల అతను పెద్ద చిక్కుల్లో పడ్డాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆలీ, బాబా భాస్కర్ ల మధ్య జరిగిన పోటీలో అగ్రెషన్ కి గురై తప్పు చేశాడు. ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి.


ఆ నియమాలకి లోబడి ఆడితేనే ఆట ఆడినట్టు ఉంటుంది. అంతే కానీ ఆ నియమాలన్నింటిని పక్కకి నెట్టి నా ఇష్టం వచ్చినట్టు ఆడతానంటే కుదరదు. సోమవారం ఆలీ చేసిన పని ఇలాగే ఉంది. టాస్క్ లో పోటీ పడుతూ బాబా భాస్కర్ ని తలతో గుద్దడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఆలీ అలా చేయడానికి కారణం ఏంటని ఆలోచిస్తే ముఖ్యంగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. టాస్క్ మొదలవడానికి ముందు ఆలీ, రాహుల్, శివజ్యోతి లు కలిసి డిస్కస్ చేస్తుంటారు.


ఆ సమయంలో రాహుల్ మాట్లాడుతూ.. నువ్వొక్కటి గెలిస్తే ఫినాలేకి వెళ్ళిపోతావు. ఇక ఏ గేమ్ ఆడినా వందశాతం ఎఫర్ట్ పెట్టు. పాత ఆలీని బయటకి తీసుకురా...ఏది ఏమైనా గెలిచేలాగా ఆడాలి అని చెప్తాడు. అయితే ఆలీ అంతలా అగ్రెషన్ కి గురవ్వడానికి రాహుల్ మాటలు పరోక్షంగా సాయం చేశాయని తెలుస్తుంది. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పటి వరకు ఆలీ అంత అగ్రెషన్ కి గురవలేదు. మొదటి సారి బాబా భాస్కర్ పై ఇంతలా విరుచుకుపడటం ఎన్నో విమర్శలని తెచ్చి పెట్టింది.


రాహుల్ మాటలను వినడం వల్లే ఆలీకి ఇలా అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా గేమ్ ఆడేది ఆలీనే కాబట్టి విచక్షణతో ఆడి ఉంటే బాగుండేది. ఎవరెన్ని మాటలు చెప్పినా సంయమనం కోల్పోకుండా ఆడితేనే గేమ్ గెలవగలం అని అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ ని కూడా నిందించలేం. అతని మాటలు పరోక్షంగా ఆలీకి హెల్ప్ చేసి ఉండవచ్చు. కానీ అతన్ని తప్పు పట్టలేమని  నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: