ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అది పూజా హెగ్దె హీరోయిన్ అని చెప్పొచ్చు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు ఫ్లాపైనా ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక అప్పటి నుండి అమ్మడు వరుసగా స్టార్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. 


ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ ఇలా వరుసగా స్టార్స్ తో నటిస్తున్న పూజా ఓ పక్క తెలుగులో టాప్ స్టార్స్ తో నటిస్తూ బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక లేటెస్ట్ గా హౌజ్ ఫుల్ 4 సినిమా చేస్తున్న పూజా హెగ్దె.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను ఇదవరకు నటించిన మొహెంజోదారో సినిమా గురించి కూడా ప్రస్థావించింది. 


హృతిక్ రోషన్ తో ఛాన్స్ రావడమే గొప్ప విషయం. అలాంటిది మొహెంజోదారో రిజల్ట్ తన కెరియర్ మీద ఎఫెక్ట్ పడ్డదని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. ఆ సినిమాలో నటించడం తన లక్ అని సినిమా చేయడం వరకే తన పని అని.. రిజల్ట్ అనేది తమ చేతుల్లో లేదని అన్నది పూజా హెగ్దె. ఫ్లాప్ అయినా సరే హృతిక్ రోషన్ సినిమా కాబట్టి ఆ సినిమా చేసినందుకు బాధ లేదని చెబుతుంది పూజా.  


ఎందుకంటే ఇప్పుడు హిట్టు ఫాంలో ఉన్నాం కదా అని మాట జారితే ఒకవేళ హృతిక్ మళ్లీ ఓ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటే మొహెంజోదారో మీద ఆమె చేసిన కామెంట్స్ అడ్డు కాకూడదని ఆమె ఫీల్ అవుతుంది. మొత్తానికి పూజా హెగ్దె మంచి ఆలోచనతోనే మొహెజోదారో మీద ఎలాంటి టంగ్ స్లిప్ అవట్లేదని తెలుస్తుంది.  సౌత్ తో పాటుగా హిందిలో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: