కంగన రనౌత్..! ఈ పేరు తెలియని బాలీవుడ్ అభిమానులు ఉండరు. హిందీ చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కంగన అలాగే ఎప్పుడు చూసినా నా నోటిదుండుకు వల్ల వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. అయినా ఆమె యొక్క నటన ప్రతిభ గురించి తెలిసినవారు ప్రతిసారి ఆమెను ప్రశంసిస్తూనే ఉంటారు. కంగన నమ్మే సిద్ధాంతం ఒక్కటే.... ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరువాత అన్ని రకాల సినిమాలు చేస్తూ అన్ని సన్నివేశాలలో నటించాలి. అప్పుడే మన టాలెంట్ ప్రేక్షకులకి తెలిసేది అని. ఇలా వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయని ఈమెకు ఇప్పుడు మరొక ఛాలెంజింగ్ పాత్ర చేయబోతోంది.

గత కొద్ది రోజుల ముందు అమలాపాల్ హీరోయిన్ గా నటించిన 'ఆమె' సినిమా సినీ సర్కిల్స్ లో చాలా చర్చకు దారితీసింది. విషయం ఏమిటంటే ఆ సినిమాలో అమలాపాల్ దాదాపు ఒక గంట పాటు నగ్నంగా నటించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫెయిల్ అయినప్పటికీ అమలాపాల్ కి మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది. సమంత, కరణ్ జోహార్ వంటి ఎంతో మంది ప్రముఖులు అమలపాల్ చేసిన నటన మరియు చూపిన తెగువకు మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే చిత్రాన్ని బాలీవుడ్లో కంగన రీమేక్ చేయబోతుంది.

అమలాపాల్ లాగా ఇలాంటి బోల్డ్ పాత్రలో నటించే సత్తా కంగనకు మాత్రమే ఉందని భావించి ఆమెను ఈ సినిమాలో ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కంగన దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ఆమె దీని రీమేక్ లో నటిస్తుందని తెలుస్తోంది. ఎప్పటికైనా దక్షిణాది కన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలని భావిస్తారు ఉత్తరాది హీరోయిన్లు. ఇప్పుడు కంగనా తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత దూరం వెళుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: