యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఓంకార్ ప్రస్తుతం దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదతి సినిమా "జీనియస్" అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ తర్వాత తన తమ్ముడితో తీసిన రాజు గారి గది చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత నాగార్జున తో రాజు గారి గది 2 తీశాడు. ఇది మొదటి సినిమా అంత కాకపోయినా ఓ మోస్తారుగా నడిచింది. అయితే ఇక మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ తీయాలనే రాజు గారి గది 3 తో మనముందుకు వచ్చాడు.


అయితే ఈ సినిమాలో ముందుగా తమన్నాని తీసుకుందామని అనుకుని ఆమెకు కథ కూడా చెప్పారట. ఆమె ఓకే అనేయడంతో సినిమా మొదలెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే సడెన్ గా తమన్నా ఈ సినిమా నుండి తప్పుకుంది. స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని తమన్నా కోరిందట. కానీ ఓంకార్ దానికి ఒప్పుకోకపోవడంతో తమన్నా ఈ చిత్రం నుండి తప్పుకుందని టాక్.


అయితే తమన్నా సినిమా చేయనని చెప్పడంతో వేరే హీరోయిన్ కోసం వెతికి వెతికి చివరికి ఉయ్యాలా జంపాలా ఫేమ్ అవికా గోర్ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో అవికా గోర్ పాత్ర అంత ముఖ్యమైనది కాదనే వార్తలు వచ్చాయి. అలాంటి పాత్ర తమన్నా రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని అంటున్నారు. అయితే అసలు కథ వేరే ఉంది. తమన్నా వద్దని వెళ్ళిన తర్వాత ఓంకార్ కథలో మార్పులు చేశాడట.


అప్పటి వరకు హీరోయిన్ ఓరియంటెడ్ గా ఉన్న కథని హీరోకి తగ్గట్టు మార్చేసాడట. తన తమ్ముడు అశ్విన్ ని హీరో చేయడానికే అలా చేశాడని అంటున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన తమ్ముడు హీరోగా ఎలివేట్ అయ్యాడని ఓంకార్ సంబరపడుతున్నాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: