టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మహేష్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సంగీత, హరితేజ, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇకపోతే గతంలో వరుసగా మహేష్ తో భరత్ అనే నేను, మహర్షి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్, ఈ సినిమాకు మరింత అదిరిపోయే రేంజ్ లో పాటలు కంపోజ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉందని, ఆ సాంగ్ తప్పకుండా మహేష్ గారి ఫ్యాన్స్ కి ఎంతో నచ్చుతుందని, ఇటీవల ఈ సినిమా ప్రారంభం సమయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే మాటిచ్చినట్లుగానే ఆ సాంగ్ కోసం అదిరిపోయే ఒక ట్యూన్ ని సిద్ధం చేసాడట దేవి. 

'బందరు మిఠాయి బోర్డరు సిపాయి' అనే పల్లవితో ఈ సాంగ్ మొదలవుతుందని, ఇక మిల్కి బ్యూటీ తమన్నా ఈ సాంగ్ లో తన హొయలొలికించే అందాలతో సాంగ్ కు మరింత జోష్ తీసుకురాబోతుందని అంటున్నారు. మరికొద్దిరోజుల్లో ఈ సాంగ్ ని ఎంతో రిచ్ గా 1970 ల కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా వేసిన ఒక సెట్టింగ్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించనున్నారట. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సాంగ్ తో మరింత పండుగ చేసుకోవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: