టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సవ్యసాచి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత నిరాశను ఎదుర్కొంది. అయినప్పటికీ తన ఆకట్టుకునే అందం మరియు అభినయంతో కుర్రకారు మనసులో గుబులు రేపిన ఈ భామ, తదుపరి అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే అనూహ్యంగా ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కలయికలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైన నిధి

ఆ సినిమా పెద్ద హిట్ కొట్టడంతో, టాలీవుడ్ లో హీరోయిన్ గా తొలి విజయాన్ని ఆమె అందుకుంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు తెలుగు సినిమాలు అయితే చేతిలో లేవు. ఇకపోతే నిన్న లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా, 'వూట్' ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైయ్యే 'ఫీటప్ విత్ స్టార్స్' అనే కార్యక్రమంలో పాల్గొంది నిధి అగర్వాల్. అయితే ఆ షోలో తన మనసులోని భావాలను బహిర్గత పరిచిన నిధి, తనకు భర్త కాబోయే వ్యక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అతడు ఆరడుగుల అందగాడై ఉండాలి, మంచి మనస్తత్వం ఉండి నన్ను అర్థం చేసుకోవాలి, అలానే జీవితంలో బాగా స్థిరపడి నన్ను ఒక పాపలా బాగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు క్రికెటర్ కె ఎల్ రాహుల్ తో ఏదో అఫైర్ ఉందని, 

అలానే మీ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు ప్రచారం అయ్యాయి, దానిపై నీ కామెంట్ ఏంటి అని లక్ష్మి అడిగిన ప్రశ్నకు షాకింగ్ గా బదులిచ్చింది నిధి. నిజానికి తనకు రాహుల్ తో అసలు పరిచయం లేదని, అయితే నేను, అతను ఇద్దరం కూడా స్కూల్ మేట్స్ కావడంతో, ఇటీవల ఒక సందర్భంలో ఆ విషయాన్ని  గుర్తు చేసుకుని కాఫీ షాప్ లో కలిసి మాట్లాడుకున్నాం. అంతేతప్పించి తమ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని గట్టిగా తెగేసి చెప్పింది నిధి. దీనితో ఆమెపై వస్తున్న పుకార్లకు చాలావరకు అడ్డు కట్ట పడ్డట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: