దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.ప్రస్తుతం రాజమౌళి లండన్ లో రాయల్ అల్బర్ట్ హాల్ లో బాహుబలి సినిమా లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనలో  బిజీగా ఉన్నారు. లైవ్ కాన్సర్ట్ కోసం రాజమౌళి పంచకట్టు ధరించడం స్పెషల్ అట్రక్షాన్ గా నిలిచింది.


బాహుబలి సినిమాతో రాజమౌళి బ్రాండ్ ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. తన సినిమాకి బాలీవుడ్ తారలు లేకుండా పాన్ ఇండియా అప్పీల్ రాదనీ భయపడ్డాడు. అందుకే తీసేది తెలుగు స్టార్స్ తో మల్టీస్టారర్ సినిమా అయినా హిందీ తారలను కూడా తన సినిమాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి ప్లానింగ్ ని ఇదే దెబ్బకొట్టింది.


ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం అవడానికి కారణం బాలీవుడ్ నటులే అంట. అలియా భట్ ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె డేట్స్ అసలు దొరకడం లేదు. దాంతో ఆమె పాత్రని కుదించారని తెలుస్తుంది. ఇక అజయ్ దేవగన్ తన హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిందీ సినిమాని పక్కన పెట్టి దీనికి డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో అతనికోసం జనవరి వరకు వేచి చూడక తప్పదు.


తమకు అనుకూలమైన టైం లోనే డేట్స్ ఇస్తున్నారు బాలీవుడ్ తారలు. దాంతో ఆర్.ఆర్.ఆర్ ఏడాదికి పైగా ఆలస్యం కానున్నదని అంటున్నారు. రాజమౌళి సినిమాలు ఏవి అనుకున్న సమయానికి పూర్తి కావు. కానీ, పకడ్బందీ వ్యూహంతో వెళ్ళాడు. అయినప్పటికీ బాలీవుడ్ నటుల రూపంలో అతని ప్రణాళిక మొత్తం రివర్స్ అయ్యింది. తాజాగా ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పటికే రాజమౌళి ఓ హింట్ ఇచ్చారు. తెలంగాణ నుంచి కొమురం భీం, ఆంధ్రా నుంచి సీతారామరాజు ఇద్దరు రెండు సంవత్సరాల పాటు మిస్సవుతారు. ఎటువెళ్లారో తెలియదు, ఎక్కుడున్నారో తెలియదు. రెండు సంవత్సరాల తరువాత స్వాత్రంత్యం కోసం బ్రిటీష్ వారిపై సీతారామరాజు, నిజాం నవాబులపై కొమరం భీం పోరాటం మొదలు పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: