ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ మూవీ అల్లు అర్జున్ మహేష్ బాబుల సినిమాకు టెన్షన్ పెట్టించడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. ‘వెంకీ మామ’ సంక్రాంతికి వస్తుందనే వార్తలు వస్తుండడంతో ‘అల వైకుంఠపురంలో’ ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలతో పాటు మహేష్ బన్నీలకు కూడ గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాలలో సురేష్ బాబు కింద చెప్పుకోదగిన స్థాయిలోనే థియేటర్లు ఉన్నాయి. 

దీనితో ‘వెంకీ మామ’ సినిమా కోసం వాటిని బ్లాక్ చేస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ మహేష్ అల్లు అర్జున్ మూవీ నిర్మాతలకు ఉంది. దీనికితోడు సురేష్ బాబు తన ఆధ్వర్యంలోని థియేటర్ల మేనేజర్లకు సంక్రాంతికి ఎటువంటి సినిమాల ఎగ్రిమెంట్లు చేసుకోవద్దని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది అంతా ‘వెంకీ మామ’ కోసం సురేశ్ బాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు. దీనితో తన సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోమని సురేశ్ బాబు వద్దకు రాయబారాలు తీసుకు వస్తున్న నిర్మాతలతో సురేశ్ బాబు చెపుతున్న కారణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ‘వెంకీ మామ’ సినిమాకు గ్రాఫిక్స్ చాల అవసరమనీ ఇప్పటికే ఈ మూవీ గ్రాఫిక్ వర్క్స్ పూర్తి అయినా ఆ పని తనకు పూర్తిగా నచ్చలేదనీ అందువల్ల ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ రీ వర్క్ జరుగుతోంది అంటూ తప్పించుకుంటున్నట్లు టాక్. 

దీనితో ‘వెంకీ మామ’ సినిమాలో అంత భారీ గ్రాఫిక్స్ వ్యవహారం ఏమిటి అంటూ సురేశ్ బాబు వద్దకు వెళ్ళిన నిర్మాతలు తల పట్టుకుంటున్నట్లు టాక్. అయితే సురేశ్ బాబు మాటలను విశ్లేషిస్తున్న వారు మాత్రం సురేశ్ బాబు ఇది అంతా వ్యూహాత్మకంగా నడిపిస్తున్న డ్రామా అని ‘వెంకీ మామ’ ను సంక్రాంతి రేసులో నిలపడం ఖాయం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: