చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా అక్టోబర్ రెండవ తారీకున గాంధీ జయంతి సందర్భంగా విడుదల అయ్యి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. చిరంజీవి పాలిటిక్స్ నుండి వచ్చాక అందుకున్న అతి పెద్ద హిట్ సినిమా సైరా. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి సైరా సినిమా కు ఎక్కువ టైం కేటాయించడంతో తన తర్వాత సినిమా కొరటాల సినిమా తొందరగానే స్టార్ట్ చేసేసారు. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించిన సినిమా యూనిట్ అతి తక్కువ సమయంలోనే సినిమా కంప్లీట్ చేసి అభిమానులకు అందించడానికి సిద్ధమవుతున్నారు.


అంతేకాకుండా ఈ సినిమాకి సైరా సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో సినిమా స్టార్టింగ్ కథ చెప్పే సమయంలో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని డైరెక్టర్ కొరటాల కి నిర్మాత రామ్ చరణ్ తేజ్ ట్విస్ట్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. దానికి కారణం సైరా సినిమా ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందే భావించి సినిమాకి భారీగా ఖర్చు పెట్టిన రామ్ చరణ్ ఆ సమయంలో కొరటాల చెప్పిన కథకు అదేస్థాయిలో ఆలోచించడం తో...కొరటాల సూచించిన బడ్జెట్ కి రాంచరణ్ ఓకే చెప్పాడ.


అయితే సైరా సినిమా తెలుగు మినహా ఇతర భాషల్లో పెద్దగా కలెక్షన్లు రాబట్ట లేని నేపథ్యంలో...కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా బడ్జెట్ రామ్ చరణ్ తగ్గించినట్లు సమాచారం. అంటే మామూలు బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తీసి, సైరా తో వచ్చిన లాస్ ని కవర్ చేసుకుందామనే ఆలోచనలో రామ్ చరణ్ తేజ్ ఉన్నారని ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: