అడవి శేష్ ఒక నటుడిగా దర్శకుడిగా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు . అయితే ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న అడవి శేషు కి  ప్రభాస్ ఫ్యాన్స్ తో ఎదురైన చేదు అనుభవాన్ని  ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు . బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో తాను  మాట్లాడినప్పుడు ఆ సినిమా నిర్మాతలకు దర్శకుడు రాజమౌళికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారట అడవిశేష్ . అయితే ప్రభాస్ ఫంక్షన్ కి వచ్చి ప్రభాస్ పేరు మర్చిపోవువటం తో  ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని. కానీ అది కావాలని చేయలేదని తెలిపారు అడవిశేష్ . స్టేజి పైకి ఎక్కగానే అనిపించింది మాట్లాడేసానని  అడవి శేష్ అన్నాడు.

 

 

 

అయితే పంజా సినిమా  నిర్మాతలు బాహుబలి నిర్మాతలు ఒక్కరే కావడంతో ఈ సినిమా తన కెరీర్ కే  టర్నింగ్ పాయింట్ అవడంతో ఆ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత శోభు యార్లగడ్డ తో పాటు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు  చెప్పినట్లు తెలిపారు. అయితే ఆ ఫంక్షన్ లో ప్రభాస్ పేరు కావాలని మర్చిపోలేదని తొందరపాటులో ప్రభాస్ పేరు మర్చిపోయానని తెలిపారు అడివిశేష్ . అయితే నెక్స్ట్ డే అడవి శేషు కీ తన  బ్రదర్ ఫోన్ చేసి చెప్తే కానీ ఈ విషయం గుర్తు రాలేదని అన్నారు. ఇక మరుసటి రోజు ఎక్కడెక్కడి నుంచి ప్రభాస్ ఫాన్స్ ఫోన్ చేసి తిట్టారని అడవి శేష్ గుర్తు చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఫాన్స్ తిట్టినప్పుడు కొంత బాధ పడ్డ అడవిశేష్...  ఈ విషయాన్ని ప్రభాస్ వద్ద ప్రస్తావించగా... ప్రభాస్ మాత్రం దాన్ని అంత సీరియస్ గా  తీసుకోకపోవడంతో కాస్త రిలీఫ్ అయ్యానని తెలిపారు.

 

 

 

ఇక ఆ తర్వాత ప్రభాస్ ఫాన్స్ తిట్టడాన్ని  కూడా లైట్ తీసుకున్నానని  తెలిపారు ఆయన. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా గతంలో అడవిశేషు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఉండగా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ అడివి శేష్ హీరో గా మంచి ఇమేజ్ ని సంపాదించుకుంటున్నాడు . వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు అడవి శేషు.

మరింత సమాచారం తెలుసుకోండి: