కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఒక్క  మలయాళం లో తప్ప ప్రస్తుతం మిగితా మూడు భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ ల తో  బిజీ గా వుంది.  అందులో భాగంగా  ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూ  అలాగే  యంగ్ హీరో నితిన్ కు జోడిగా భీష్మ చిత్రాల్లో నటిస్తుంది. వీటిలో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తుది దశకు చేరుకుంది. రష్మిక కెరీర్ లో  స్టార్ హీరో తో  నటించడం  ఇదే మొదటిసారి. ఇక తమిళం లో కార్తి నటిస్తున్న సుల్తాన్ లో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక.  ఈ చిత్రం తో  ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇటీవలే ఈ సినిమా  షూటింగ్  స్టార్ట్ అయ్యింది. వీటి తో  రష్మిక పాటు మాతృక లో పొగరు చిత్రంలో నటిస్తుంది. 




ఇలా  నాలుగు సినిమాల్లో నటిస్తుండడం తో    వివిధ ప్రదేశాలకు ట్రావెల్ చేయాల్సి వస్తుందట. దాంతో  రష్మిక  ఇంట్లో  ఉండడానికి  సమయం కూడా దొరకడం లేదట.  రెండురోజుల  క్రిందట  ఆమె కూర్గ్ లోని తన ఇంటికి వెళ్లి  ఓరోజు అంతా అక్కడే గడిపిందట. దాంతో ఆరు నెలల్లో ఓ  రోజంతా ఇంట్లో ఉండడం అదే  మొదటి సారి అంటూ   తాజాగా ఓ ఇంటర్వ్యూ లో  చెప్పుకొచ్చింది రష్మిక. ఇక రష్మిక  ప్రస్తుతం  పొగరు షూటింగ్ లో పాల్గొంటుంది.  ఈ షూటింగ్ బెంగుళూరు లో జరుగుతుంది. దీని తర్వాత  ఆమె హైదరాబాద్ , రాజమండ్రి కి  వచ్చి తెలుగు సినిమా ల షూటింగ్లో పాల్గొనాల్సి వుంది. ఆతరువాత సుల్తాన్ కోసం  దుండిగల్ , పొల్లాచ్చి వెళ్లనుంది.  తరువాత ఓ నెల పాటు యూరప్ లో జరుగనున్న షెడ్యూల్ లో  జాయిన్  కానుంది రష్మిక. 


మరింత సమాచారం తెలుసుకోండి: