కోలీవుడ్ లో ఇళయదళపతి
విజయ్ తో కలిసి మెర్సల్ మరియు తేరి అనే సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన యువ దర్శకుడు అట్లీ కుమార్. తొలిసారి
రాజా రాణి అనే
సినిమా తీసి ఫస్ట్ మూవీ తోనే హిట్ అందుకున్న అట్లీ, ప్రస్తుతం మరొక్కసారి
విజయ్ హీరోగా
బిగిల్ అనే సినిమాను తెరకెక్కించాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో
విజయ్ సరసన
నయనతార హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రహమాన్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో నిర్మాత
mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు భారీ ధరకు కొనుగోలు చేసి, తన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో
విజిల్ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 700 థియేటర్స్ లో రిలీజ్ చేయబోత్బున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగు వర్షన్ కు సంబంధించి నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో కాసేపటి క్రితం నిర్వహించింది
సినిమా యూనిట్. ఈ వేడుకకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్
శంకర్ సహా మరికొందరు
టాలీవుడ్ నటులు హాజరవడం జరిగింది. అయితే ఈ వేడుకలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, హీరో
విజయ్ అన్న లేకపోతే తాను లేనని, మొదటి
సినిమా తరువాత తనతో
విజయ్ అన్న తేరి సినిమా చేసారని, అయితే ఆ సినిమాలో నా పనితనం ఆయనకు ఎంతో నచ్చడంతో మరొక రెండు సినిమాలు ఆయనతో చేసే అవకాశం దొరికిందని అన్నారు.
ప్రస్తుతం తెరకెక్కిన
బిగిల్ సినిమా మంచి సక్సెస్ అవడం ఖాయమని అట్లీ ఆశాభావం వ్యక్తం చేసారు. ఇకపోతే
టాలీవుడ్ లో తనకు జూనియర్
ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం మరియు ఇష్టమని, తన ప్రతి
సినిమా రిలీజ్ సమయంలో
ఎన్టీఆర్ గారు ఎంతో ప్రేమతో కాల్ చేసి,
సినిమా అద్భుతంగా ఉంది, అదరగొట్టావ్ అంటూ తనను పొగడ్తలతో ముంచెత్తి, తనకు మంచి గుండె ధైర్యాన్ని అందించేవారని అన్నారు. తనకు ఎప్పటినుండో తెలుగులో ఒక
సినిమా చేయాలని ఉందని, తప్పకుండా ఆ అవకాశం వస్తే మాత్రం, ఎన్టీఆర్ గారితో ఒక మంచి మాస్ సినిమాను తీస్తానని అన్నారు అట్లీ....!!