బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ఇలియానా జంటగా నటించిన చిత్రం పాగల్ పంతి. ‘జాగ్రత్త అందరికి .. ఈ ట్రైలర్ను బుర్ర పెట్టి చూడకండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికీ బుర్రలేదు’ అనే డిస్క్లైమర్ని ఎక్కడైనా మీరు చూశారా? కానీ గోవా
బ్యూటీ ఇలియానా
సినిమా ట్రైలర్కు మాత్రం ఇలా ఉండడం గమనార్థకం. ఈ సినిమాలో పుల్కిత్ సమ్రాట్, కృతి కర్బంద, అర్షద్ వార్సి,
ఊర్వశి రౌతెల,
అనిల్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి
అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ
సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ మొదట్లోనే పై డిస్క్లైమర్ను చూపించడం జరిగింది. అంటే ఈ ట్రైలర్ చూసిన వారికి పిచ్చెక్కిపోవడం ఖాయం అని అర్థం తెలుపుతుంది. ఇంతకీ
సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియాకు చెందిన కొందరు టూరిస్ట్లు విహారయాత్రకు పోతారు. కానీ ఆ ట్రిప్ కాస్తా ఓ మిషన్ లాగా మారుతుంది అందరికి. ఆ మిషన్ ఏంటి? ఈ మిషన్ను ఆ పిచ్చి టూరిస్ట్లు సక్సెస్ చేశారా? లేదా ? అన్నదే కథ. ‘శనీశ్వరుడు ఇతని వెంటే కాదు ఒడిలో కూర్చనే ఉంటాడు’ అంటూ జాన్ అబ్రహం దరిద్రం గురించి వివరిస్తున్న డైలాగ్తో ట్రైలర్ మొదలు అవుతుంది.
ఆ తర్వాత పుల్కిత్ సమ్రాట్, కృతి ఇద్దరు ప్రేమలో పడతారు. పెళ్లి గురించి మాట్లాడమని కృతి కర్బంద పుల్కిత్ను ఇంటికి పిలుస్తుంది. తీరా వెళ్లేసరికి కృతిని తాను అక్క అని పిలుస్తానని చెప్పడం నవ్వులు కురిపిస్తాయి.
సినిమా మొత్తంలో వీరు చెప్పే డైలాగులకు అసలు అర్థం ఉండదు. కానీ నవ్వులు మాత్రం బాగా పూయిస్తాయి అని తెలుపుతున్నాడు దర్శకుడు అనీస్.
దర్శకుడు అనీస్ ఈ సినిమా విడుదల అవకుండానే అప్పుడే సీక్వెల్ కూడా వస్తుందని ప్రకటన కూడా చేయడం జరిగింది.. అప్పటివరకు దేశభక్తి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లోనే నటించిన జాన్ అబ్రహం చాలా కాలం తర్వాత ఈ కామెడీ జోనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఇలియానా కూడా ఈ సినిమాతోనైనా మంచి విజయం లభిస్తుందో లేదో చూడాలి మరి. నవంబర్ లో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలిపింది చిత్ర యూనిట్.