దీపావళి సందర్భంగా హీరో
అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ కోసం 'అల వైకుంఠపురములో'
సినిమా నుండి రాములో రాములా అనే మాస్ సాంగ్ని రిలీజ్ చేసాడు. కానీ 'సరిలేరు నీకెవ్వరు' టీం మాత్రం సైలెంట్గా ఉంది. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' సామజవరగమన సాంగ్ కి ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. ఎవరి మొబైల్ రింగ్ టోన్ చూసినా ఎవరి మొబైల్ కాలర్ ట్యూన్ చూసినా ఇదే పాట. అంతలా 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ ఉంటే.. 'సరిలేరు నీకెవ్వరు' టీం మాత్రం దీపావళికి
మహేష్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసేలానే ఉన్నారు. అసలే
అల్లు అర్జున్ దూకుడు మీదుంటే..
మహేష్ మాత్రం సైలెంట్గా ఉండడం
మహేష్ ఫ్యాన్స్కి అస్సలు నచ్చడం లేదు.
అయితే 'అల వైకుంఠపురములో'
సినిమా స్పీడు మనకెందుకు.. మన
సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే గట్టి ప్రమోషన్స్ చేసేస్తే.. విడుదల సమయానికి ఇంకేం మిగలవని సరిలేరు టీం ఆలోచించే ఇలా సైలెంట్ గా ఉన్నారట. ఇక
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 లాంటి హిలేరియస్ కామెడీ సరిలేరులో ఉండడమే కాకుండా..
మహేష్ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో ఫుల్ గా ఉండబోతున్నాయట.
మహేష్ దూకుడు సినిమాలో చేసిన కామెడీ ఒక ఎత్తైతే.. సరిలేరులో
మహేష్ కామెడీ ఇంకో రేంజ్ లో ఉండబోతుందని తాజా సమాచారం. కామెడీతో రూపొందించిన యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనుందని అలానే ట్రైన్ ఎపిసోడ్ కూడా హిలేరియస్గా నవ్వించడం ఖాయమని అనుకుంటున్నారట. అంతేకాదు ఇప్పటికే మన సినిమాకున్న క్రేజ్ చాలని.. ఇప్పటి నుండే
సినిమా మీద భారీగా అంచనాలు పెంచవలసిన అవసరం లేదని
మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' టీం ధీమాగా ఉన్నారట.
ఇక 'సరిలేరు నీకెవ్వరు' టీం అలా సైలెంట్గా ఉన్నప్పటికీ సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని ఐటెం సాంగ్ లిరిక్స్ 'బందరు మిఠాయి బోర్డరు సిపాయి' అంటూ సాగే లిరిక్స్ లీక్ అయింది. మరి తమన్నా తో
మహేష్ చేయబోయే ఐటెం సాంగ్ ఊర మాస్ స్టెప్స్ కి ఈ పాట కరెక్ట్ గా సింక్ అవుతుందని ఫీలవుతున్నారట. ఇక అఫీషియల్ గా ఈ సాంగ్ రిలీజ్ చేయకపోయినప్పటికి..
మహేష్ ఫ్యాన్స్ మాత్రం లీకైన ఐటెం సాంగ్ లిరిక్స్ తోనే ఖుషీ అవుతున్నారట.