క్రియేటివ్ డైరక్టర్
కృష్ణవంశీ సినిమాలంటే ఇష్టపడే తెలుగు ఆడియెన్స్ ఈమధ్య ఆయన తన రేంజ్ కు తగిన
సినిమా తీయట్లేదని చాలా బాధపడుతున్నారు. నక్షత్రం తర్వాత
కృష్ణ వంశీ అసలు వార్తల్లో లేకుండా సైలెంట్ అయిన
కృష్ణ వంశీ లేటెస్ట్ గా ఓ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
మరాఠిలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు
కృష్ణ వంశీ.
కృష్ణ వంశీ ఈ మూవీ రీమేక్ చేస్తున్నాడని తెలిసిన ఆ దర్శకుడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
నానా పటేకర్ నటించిన నట సామ్రాట్ మూవీని తెలుగులో ప్రకాశ్
రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. ఎలాగైనా హిట్ టార్గెట్ మిస్ కాకుండదని మూవీ కోసం
పరుచూరి బ్రదర్స్ సపోర్ట్ తీసుకోనున్నారట. ఈమధ్య పరుచూరి సోదరులు మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. చిరు 150
సినిమా ఖైది నంబర్ 150కు పనిచేసిన పరుచూరి సోదరులు ఇప్పటికి కమర్షియల్ ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలు ఏం కావాలో అలా
సినిమా కథ రాస్తున్నారు.
నటసామ్రాట్ తెలుగు రీమేక్ రంగమార్తాండా మూవీకి కూడా
పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందిస్తున్నారని తెలుస్తుంది.
కృష్ణ వంశీ,
పరుచూరి బ్రదర్స్ కచ్చితంగా రంగమార్తాండా మూవీకి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.
కృష్ణ వంశీ కోరుకునే హిట్టు కల ఈ మూవీ నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఈ మూవీకి సంబందించిన మిగతా అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. రంగమార్తాండా మూవీని
కృష్ణ వంశీ చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. అందుకే హిట్టు కొట్టేందుకు పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు. మరి ఈ మూవీతో అయినా ఒకప్పటి
కృష్ణ వంశీని చూస్తామో లేదో చూడాలి.