మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం త్వరలోనే షెడ్యూల్‌ ప్రారంభించబోతున్నారు. చిరుతో సినిమా చేయడానికి ఎన్నో రోజులుగా వేచి చూసిన కొరటాల ఎట్టకేలకు అవకాశమైతే దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల ఏం చేయబోతున్నాడు..? మళ్లీ సినిమాలతో బిజీ అవుతాడా..? లేకుంటే గ్యాప్ తీసుకుంటాడా..? ఒకవేళ వెంటనే సినిమా ఉంటే ఏ హీరో తో అన్న ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్‌లో మొదలైందట.

అయితే కొరటాల డైరెక్టర్ అయినప్పటి నుంచి పెద్దగా గ్యాప్ లేకుండానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చారు. అంతేకాదు ఇప్పటివరకు తీసిన సినిమాలన్ని సూపర్ హిట్సే. ఒక్క చిరుకోసమే కొరటాల దాదాపు సంవత్సరం వేయిట్ చేశారు. అది కూడా చిరు సైరా బిజీలో ఉండటం వల్ల వచ్చిన గ్యాప్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇక గ్యాప్ తీసుకోవడమంటూ ఉండదని.. చిరు తర్వాత స్టార్ హీరోతో సినిమా చేయాలని కొరటాల ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే తనకు దర్శకుడిగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన 'మిర్చి' హీరో.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు మెగా కంపౌండ్‌లోకి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభాస్- కొర‌టాల మీటయ్యారట. ఈ సందర్భంగా కొన్ని క‌థ‌లు చర్చించుకున్నారని తాజా సమాచారం. అయితే వీటిలో ఒక కథ మాత్రం డార్లింగ్‌కు బాగా నచ్చిందట. 'డార్లింగ్ ఈ కథ నాకు.. ఓకే' అని ప్రభాస్ చెప్పగా.. త్వరలోనే మొదలుపెడదామని కొరటాల మాటిచ్చారట. ఇక ప్రస్తుతం.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్.. చిరుతో సినిమా తెరకెక్కించే పనిలో కొరటాల బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఖాళీ అయిన తర్వాత ప్రభాస్-కొరటాల కాంబోని పట్టాలెక్కిద్దామని అనుకున్నారట. మరి ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'మిర్చి' మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించింది. ఇప్పుడు ఈ కాంబోలో వచ్చే రెండవ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: