మంగళ వారం ఎపిసోడ్ తో ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో రాహుల్ ఫినాలే టికెట్ గెలుచుకుని నామినేషన్స్ నుండి తప్పించుకుని డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆలీ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్య పరిణామాల వల్ల ఆలీ టాస్క్ లో డిస్ క్వాలిఫై అయ్యి నామినేషన్స్ లోకి వచ్చాడు. అయితే రాహుల్ ఫినాలే టికెట్ దక్కించుకోవడంతో  మిగిలిన ఐదుగురు సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు.


అయితే ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం చర్చకి వచ్చింది. ఆ ఐదుగురు కంటెస్టెంట్లలో అందరికంతే వీక్ గా ఉన్న కంటెస్టెంట్లు శివజ్యొతి, ఆలీ. శివజ్యొతికి బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు. ఆలీకి శివజ్యొతి కంటే మెరుగైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ మంగళవారం ఎపిసోడ్ లో అతను చేసిన తప్పు వల్ల ప్రేక్షకుల్లో అతని పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దాంతో ఈ సారి  శివజ్యోతితో పాటు ఆలీ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు.


మొన్నటి వరకు అతని మీద నెగెటివిటీ లేదు. కానీ బాబా భాస్కర్ తో ఆడిన టాస్క్ లో తప్పు చేయడం వల్ల అతని మీద నెగెటివిటీ బాగా పెరిగింది. దీంతో అతని అభిమానులు వేరే కంటెస్టెంట్స్ కి ఓట్లేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆలీ తాను తప్పు చేశానని, ఆడియన్స్ నన్ను కాపాడండి అని విన్నవించుకున్నాడు కాబట్టి అతని మీద కొంత జాలి పడే అవకాశం కనిపిస్తుంది. 


తటస్థ అభిమానులు ఆలీని కాదని శివజ్యోతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన ఈ మూడు రోజుల్లో ఏదైనా అద్భుతం జరిగి వీరికి ఫాలోయింగ్ పెరిగితే తప్ప వీరు డేంజర్ జోన్ నుండి బయటకి రారు. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ కి గట్టి పోటీ నెలకొంది. మరి ఈ పోటీలో గెలిచి ఇంట్లో ఉండేవారు ఎవరో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: