జబర్దస్త్ షో తో యాంకర్ గా బుల్లితెరపై పాపులరైన అనసూయ భరద్వాజ్ మరోసారి తన హాట్ ఫోటో షూట్ తో అభిమానులకు కిక్కిచ్చింది.  నాలుగు పదుల వయసు దాటి, ఇద్దరు పిల్లల తల్లైనా..  తన అందంతో ఆశ్చర్యపరుస్తున్న అనసూయ  ఈ సారి నైట్ ఎఫెక్ట్ లో దిగిన ఫోటోలతో రచ్చ చేస్తోంది. ఓ మ్యాగజైన్ కోసం అనసూయ దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఆమె అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నాయనడంలో  సందేహం లేదు. 


        సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ అప్డేట్ గా ఉండే రంగమ్మత్త.. అప్పుడప్పుడూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు కిక్కిస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో నైట్ ఎఫెక్ట్ లో దిగిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆమె అందాలను చూస్తూ నెటిజన్లు మతులు పొగొట్టుకుంటున్నారు.  ఇలా ఫోటో షూట్లతో రచ్చ చేస్తూ హీరోయిన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటోంది ఈ జబర్దస్త్ భామ. 


    బుల్లితెరతో పాటు వెండితెరపైన తన పాపులారిటీని పెంచుకుంటున్న అనసూయ.. ఇలా ఫోటో షూట్లలో రెచ్చిపోతూ తన క్రేజ్ ని పెంచుకుంటోంది.  మరోవైపు ఇద్దరు పిల్లల తల్లైన అనసూయ ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడంపై పలువురు ఆమెను చాలాసార్లు విమర్శించినా.. అవేమీ తనకు పట్టవని రంగమ్మత్త కుండబద్దలు కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


       
       క్షణం, సోగ్గాడే చిన్ని నాయన, రంగస్థలం, కథనం వంటి చిత్రాలతో వెండితెరపై కూడా తనదైన ఇమేజ్ ను పెంచుకుంటున్న అనసూయ మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉందని తెలుస్తోంది.  మెగాస్టార్  చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ రంగమ్మత్త ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అటు బుల్లితెరను హీటెక్కిస్తూ, వెండితెరపై అభినయం ప్రదర్శిస్తూ.. ఫోటోషూట్లతో పాపులారిటీని పెంచుకుంటూ రంగమ్మత్త రచ్చ చేస్తోందంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: