అసలు
బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమైంది? ఒక్కసారిగా
టాలీవుడ్ కథలపై పడింది. కథలు రాసేవాళ్ళు
బాలీవుడ్ లో లేరా.. అక్కడ దర్శకులకు కథలు తక్కువయ్యాయా.. లేక వాళ్ళ కథలు ఫ్లాప్ అయి మన కథలతో
సినిమా తీస్తేనే హిట్లు వస్తున్నాయా. అంటే అవును అనే అంటున్నారు.
2019 బాలీవుడ్కు రీమేక్ నామ సంవత్సరం అనే చెప్పాలి. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలన్నీ ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఒక తెలుగు
సినిమా రిలీజ్ అవుతుందో లేదో.. అలా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోవడం చక చకా జరిగిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన సినిమాలను
బాలీవుడ్ రీమేక్ చేయడం మనకే గర్వకారణం.
అయితే అన్ని సినిమాలు 'కబీర్ సింగ్'లా బ్లాక్ బస్టర్ అవుతాయన్న గ్యారెంటీ లేదన్న విషయం కూడా చూసుకోవాలి. ఏదేమైనా మొత్తానికి
బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తెలుగు కథల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చెప్పాలంటే రాబోయె రోజుల్లో బాలీవుడ్లో విడుదలయ్యేవన్నీ మన సినిమాలకు రీమేక్లే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్
సినిమా రీమేక్కు సంబంధించిన చర్చలు
బాలీవుడ్ లో జరుగుతున్నాయి. తెలుగులో 'అందరి లెక్కలు తేలాలి' అంటూ
అనుష్క బాక్సాఫీస్ లెక్కల్ని కూడా తేల్చేసిన 'భాగమతి'
సినిమాని హిందీలో రీమేక్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట. భాగమతి సినిమాను తెరకెక్కించిన అశోక్కు బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగమతి సినిమాను రీమేక్ చేయాలని అశోక్ కు ఆఫర్ చేశారట.
అనుష్క పాత్రలో
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ను ఎంపిక చేసుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. అయితే
అనుష్క రేంజ్ లో భూమి పెర్ఫాం చేయలేదని స్వీటి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అందుకే అనుష్కకు తగ్గ నటిని
బాలీవుడ్ రీమేక్ కి ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారట. ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమాలో భూమి నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఈ
సినిమా చూశాకే భూమి కి భాగమతి రీమేక్లో నటించే అవకాశం ఇచ్చారట. అయితే భాగమతి లాంటి సినిమాను భూమి తన భుజాలపై మోయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు భూమి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో నటించింది కానీ భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించలేదు. ఒకవేళ సినిమాలో భూమిని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా భూమి కెరీర్కు ప్లస్ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే విమర్శకుల అంచనాలను తలకిందులు చేసేలా భూమి తన నటనతో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.