మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 అనే సినిమాలో హీరోగా నటించి, టాలీవుడ్ కి కం బ్యాక్ ఇవ్వడం జరిగింది. అంతకముందు కొన్నేళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాల్లో కొనసాగిన మెగాస్టార్, ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని కైవశం చేసుకున్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన 151 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వాతంత్రోద్యమ నేపధ్య చిత్రం సైరా నరసింహారెడ్డి, యావరేజ్ టాక్ ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఆ సినిమాలో మెగాస్టార్ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు మాత్రం దక్కాయి. 

మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇకపోతే దాని తరువాత మెగాస్టార్ త్వరలో నటించబోయే 152వ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్లు రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజం కాదని, 

విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమలో హీరోయిన్ గా సైరాలో నటించిన నయనతారనే మరొక్కసారి మెగాస్టార్ ప్రక్కన నటింపచేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. రెండు రోజుల క్రితం దర్శకుడు కొరటాల శివసినిమా కథను నయనతారకు వినిపించి ఆమె డేట్స్ కూడా తీసుకోవడం జరిగిందని, ఆమెకు సంబందించిన అధికారిక ప్రకటన దీపావళి రోజున వస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం, మరొక్క రెండు రోజులు ఓపికపట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: