టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా విజయాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన
భరత్ అనే నేను, అలానే ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
మహర్షి సినిమాలతో రెండు భారీ హిట్స్ కొట్టిన
సూపర్ స్టార్, ప్రస్తుతం యువ దర్శకుడు
అనిల్ రావిపూడితో కలిసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇకపోతే కొన్నేళ్ల నుండి
మహేష్,
రాజమౌళి ల కాంబినేషన్లో
సినిమా విషయమై
టాలీవుడ్ లో విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను మాత్రం ఎక్కువ శాతం దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల
మహేష్ మరియు
రాజమౌళి కూడా పలు మార్లు చెప్పడం జరిగింది.
అయితే వారిద్దరి కాంబినేషన్లో ఎటువంటి
సినిమా వస్తే బాగుంటుందని కొద్దిరోజులుగా పలు
మీడియా మాధ్యమాల్లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అంతేకాక ఇటీవల మూడు సోషల్
మీడియా వెబ్ సైట్స్ వారు, వారిద్దరి కాంబినేషన్లో మీరు ఎటువంటి
సినిమా వస్తే బాగుటుందని అని అనుకుంటున్నారు అని పోల్ నిర్వహించగా, వాటిలో మెజారిటీ ప్రేక్షకులు వారిద్దరి కాంబోలో మంచి ట్రెండీ స్టయిల్లో సాగె జేమ్స్ బాండ్ కథాంశంతో
సినిమా వస్తే బాగుంటుందని, ఎందుకంటే అటువంటి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని, అటువంటి పాత్రల్లో నటించడానికి హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ మాత్రమే సరిపోతారని, అలానే అటువంటి సినిమాను ఎంతో ఛాలెంజింగ్ గా తెరకెక్కించగల సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉంటుందని తేల్చారట.
అయితే కొన్నేళ్ల క్రితం మహేష్ గారు నటించిన
బిజినెస్ మ్యాన్ సినిమా ఆడియో ఫంక్షన్లో, నేను
మహేష్ గారితో ఎటువంటి
సినిమా చేయాలని మీరు కోరుకుంటున్నారు అని ఫ్యాన్స్ ని అడిగితే, మెజారిటీ ప్రేక్షకులు జేమ్స్ బాండ్ తరహా సినిమాకే రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందని, ఇటీవల
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ లో
రాజమౌళి కూడా చెప్పారు. అదిమాత్రమే కాక, ఆయన తండ్రి
సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఆ తరహా సినిమాల్లో నటించి ఎంతో అత్యద్భుతమైన పేరు సంపాదించడంతో,
మహేష్ ని కూడా ఆ విధమైన క్యారెక్టర్లోనే చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి రాబోయే రోజుల్లో
రాజమౌళి, ఎంతవరకు
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో చూడాలి.....!!