కృష్ణవంశీ, నాని కాంబినేషన్లో వచ్చిన పైసా మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. పైసా మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, ఫైనాన్షియల్ కారణాలతో చాలా కాలం వాయిదా పడుకుంటూ వచ్చింది. నిన్న రిలీజ్ అయిన పైసా మూవీ మొదటి రోజు బాక్సాపీస్ ఆశించినంతగానే ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి. పైసా మూవీ మొదటి రోజు ధియోటర్ల వద్ద డెబ్భై అయిదు శాతం ఆక్యుపెన్సీతో ఆడింది.దీంతో కలెక్షన్స్ కూడ పర్వాలేదనిపించాయి.
కృష్ణవంశీ చాలా కసితో తీసిన మూవీ పైసా మూవీకు పాజిటివ్ పబ్లిసిటీను సొంతం చేసుకుంది. అందకే ఈ మూవీకు మొదటి రోజు అన్ని కేటగిరీ ప్రేక్షకులు వెళ్ళారు. మూవీ డీసెంట్ సక్సెస్ అని టాక్ రావడంతో సాయంత్రానికి చాలా థియోటర్లు హౌస్ఫుల్ బోర్లులతో దర్శనమిచ్చాయి. మొత్తంగా పైసా మూవీ మొదటి రోజు కలెక్షన్స్ను చూసుకుంటే 3.8 కోట్ల రూపాయలను సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ ఇలా ఉంటే, ఓవర్సీస్ కలుపుకుంటే ఇది నాలుగున్నర కోట్లకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
నాని బ్రాండ్, కృష్ణవంశీ బ్రాండ్లతో వచ్చిన పైసా మూవీ ప్రేక్షకులను అలరించినప్పటికీ, బాక్సాపీస్ వద్ద నిలకడగా నిలబడాలంటే కొద్దిగా కష్టమే అని అంటున్నారు. ఏదేమైన మూవీకు పెట్టిన బడ్జెట్లో కనీసం అరవైశాతం వరకూ రాబట్టుకోవచ్చని టాలీవుడ్ ట్రేడ్ టాక్.
మరింత సమాచారం తెలుసుకోండి: