కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతు తన గట్టి పోటీదార్లు అయిన హాన్సిక, కాజల్ లాంటి ముద్దుగుమ్మలు ఒప్పుకున్న సినిమాలను వారి నుండి తన వైపు లాగేసుకుని సంచలనాల పై సంచలనాలు సృష్టి స్తోంది నయనతార. అటువంటి నయన్ నిరాహారదీక్ష చేపట్టింది. అయితే రాజకీయ నాయకులలా ఓట్ల కోసం, సీట్లు కోసం కాదు. నయన్ చేస్తున్న నిరాహారదీక్ష దీక్ష ఒక సినిమా కోసం, తెలుస్తున్న సమాచారం ప్రకారం నయన తార శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాను నటిస్తున్న కహానీ రీమేక్ అనామిక సినిమా కోసం నయన తార పది రోజులుగా ఆహారాన్ని తీసుకోకుండా కేవలం ద్రవ పదార్ధాలు తీసుకుంటోoది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేయపడ్డ ఓల్డ్ సిటీ లోని ఒక టెంపుల్ సెట్లో నీరసంగా తాను నటిస్తున్న పాత్ర కోసం సహజంగా కనిపించడానికి ఇలా నిరాహారదీక్ష చేపట్టిందని తెలుస్తోంది. క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల నయన తార కమిట్ మెంట్ ను చూసి ఆశ్చర్య పోవడమే కాకుండా ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ కమ్ముల మీడియాకు తెలియచేసాడు.  గ్లామరస్ నటిగా పేరుగాంచిన నయన్ నటన ప్రతిభను బాపు ‘శ్రీరమరాజ్యం’ ఋజువు చేస్తే రాబోతున్న అనామిక నయన తారలోని అద్వితీయ నటనను మరొకసారి వెలుగులోకి తీసుకు వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా విజయం అటు నాయనకే కాకుండా దర్శకుడు శేఖర్ కమ్ములకు కూడా చాల అవసరం. మార్చి, ఏప్రియల్ నెలలలో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: