ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం ఒక హాబీగా మారింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యల పై కేరళ కాంగ్రెస్‌వాదులు ఆమె మీద గుర్రుగా ఉన్నారు. ఇక వివరాల్లోకెళితే తమిళంలో ఇవన్ యువతి తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి రీమా కళింగళ్. ఈ బ్యూటీ మలయాళంలో రీతు, హ్యాపీ హజ్‌బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈసినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ సరిపోలేదు కాబోలు ఆమె తన రూట్ మార్చి ఈమధ్యనే గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్‌ షీలాదీక్షిత్‌పై తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై షీలాదీక్షిత్ అప్పట్లో మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ ఈరోజు కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్‌బుక్‌లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే లేపింది. పట్టపగలే స్త్రీల పై అత్యాచారాలు జరుగుతున్న విషయం మన కేరళా కుట్టి రీమా కళింగళ్ కు తెలియదు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: