వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు చిత్రం ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో రామ్. ఈ యువ హీరో తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తరువాత రామ్ రెఢీ, మస్కా, కందిరీగ వంటి హిట్ సినిమాలో నటించాడు. అయితే రామ్ గత చిత్రం ఎందుకంటే ప్రేమంట ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు ఆ మాత్రం ఆ రేంజ్ లో రాలేదు. కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందించిన ఎందుకంటే ప్రేమంట చిత్రం రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా నాణ్యత కోసమే భారీ బడ్జెట్ తో ఆ సినిమా నిర్మించినట్లు హీరో రామ్ చెప్పినా, సినిమా ఫలితం మాత్రం ఆ స్థాయిలో రాలేదు. ఎందుకంటే ప్రేమంట సినిమా రామ్ కెరీర్ లో ప్లాప్ గా మిగిలిపోయింది. దీనికి కారణం ఆ సినిమాను రామ్ కు ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మించడమేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, రామ్ ప్రస్తుతం ఒంగోలు గిత్త అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్రానికి కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో రామ్ గత చిత్రంలానే భాస్కర్ గత సినిమా ఆరెంజ్ చిత్రాన్నీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆరెంజ్ సినిమాకు కు భాస్కర్ ఎక్కవ ఖర్చు పెట్టించాడని సాక్షాత్తూ చిత్ర నిర్మాత నాగేంద్రబాబే గగ్గోలు పెట్టాడు. కాగా, ఇప్పుడు ఒంగోలు గిత్త కు కూడా అదే విషయం రిపీట్ అవుతుందని తెలుస్తుంది. ఒంగోలు గిత్త లో హీరోయిన్ మారడంతో చాలా సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావడం, అలాగే భాస్కర్ కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టిస్తుండంతో ఈ ఒంగోలు గిత్త సినిమా కూడా రామ్ మార్కెట్ ను మించిన బడ్జెట్ తో తయారు అవుతుందట. దీంతో ఎందుకంటే ప్రేమంట సినిమాకు చేసిన తప్పునే రామ్ మళ్లీ ఈ ఒంగోలు గిత్త కూ చేస్తున్నాడని సినిమా పరిశ్రమలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. హీరోగా మంచి భవిష్యత్ ఉన్న రామ్ ఇలా చేసిన తప్పులే చేసుకుంటూ పోతే రామ్ కెరీర్ కే నష్టమని చాలా మంది భావిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: