టాప్ హీరోలలో ఒక్క బాలకృష్ణ తప్ప వెంకీ – నాగ్ లు తమ రాబోతున్న సినిమాలలో ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాల వైపే మగ్గు చూపుతున్నారు. ఈ రేసులో వెంకటేష్‌ ముందుగా మల్టీస్టారర్ల వైపు మొగ్గు చూపి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ చిత్రాల్లో నటించి ముందు ఉందామని ప్రయత్నించినా వెండి తెర మన్మధుడు నాగార్జున ఈ మల్టీ స్టారర్స్ విషయంలో రాబోతున్న కాలంలో వెంకీని డామినేట్ చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు చాలామంది వెంకటేష్ కంటే నాగ్ తో కలిసి నటించడానికి ఆశక్తి చూపించడమే అంటున్నారు. ఈ విషయంలో మరో కోణం కూడ ఉంది నాగార్జున ఇంకా యంగ్ హీరోలతో మల్టీస్టారర్స్‌లో నటించకపోవడమే కారణం అనే వారు కూడ ఉన్నారు. ‘మసాలా’ సినిమాతో వెంకటేష్‌ మల్టీస్టారర్ ట్రెండ్ ను డైల్యూట్‌ చేసిందని విమర్శకుల వాదన. దీంతో యంగ్ హీరోలకు నాగార్జున ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయాడు. అంతేకాదు నాగార్జున డేట్స్‌ కోసం మహేష్‌, ఎన్టీఆర్‌ లాంటి టాప్ హీరోలు కూడ పోటీ పడే పరిస్థితి రావడం ఆశ్చర్యంగా మారింది. మహేష్‌, నాగ్‌తో మణిరత్నం, ఎన్టీఆర్‌, నాగ్‌తో పైడిపల్లి వంశీ సినిమాలు తీయడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో మొదలైతే కనుక ఏది ముందు ఫినిష్‌ చేయాలనే టెన్షన్ లో నాగార్జున ఉన్నాడట. అంతేకాకుండా నాగార్జున నటించే మల్టీ స్టారర్ సినిమాలకు మార్కెట్ పరంగా కూడ మంచి క్రేజ్ ఉందని టాలీవుడ్ టాక్. దీనితో ప్రస్తుతం యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా నాగార్జున ఎదిగిపోయాడు అంటు సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: