తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అనామిక మూవీ ఆడియో విడుదల జరిగింది. ఈ ఫంక్షన్ కు చిత్ర కథానాయిక అయిన నయనతార హాజరు కాలేదు. దీనికి వెనుక ఉన్న కారణం ఏంటో అన్న దానిపై టాలీవుడ్ లో పలురకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన కహానీ మూవీకు రిమేక్ గా అనామిక మూవీను శేఖర్ కమ్ముల తెలుగులో రిమేక్ చేశాడు. అయితే ఈ మూవీకు సంబంధించిన ప్రమోషన్స్ దగ్గర నుండి, కనీసం ఆడియో ఫంక్షన్స్ వరకూ నయనతార, దర్శకుడితో కాని, నిర్మాతలతో కాని ఏ మాత్రం సహకరించలేదు. ఇటీవలే జరిగిన ‘అనామిక’ ఆడియో లాంచ్ కార్యక్రమానికి కూడా నయనతార హాజరు కాలేదు. ఈ విషయంలో శేఖర్ కమ్ముల కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. నయనతారను అనామిక ఆడియో ఫంక్షన్ కు రావాలని దర్శకుడు కోరినా, తను మాత్రం వచ్చేది లేదంటూ, తన అగ్రిమెంట్స్ లో ఈ విధంగా లేదంటూ కచ్ఛితంగా చెప్పిందట. శేఖర్ కమ్ముల, ప్రమోషన్ కు రావాల్సిందే అని గట్టిగా అడిగితే అప్పుడు నయన తార చెప్పిన సమాధానానికి శేఖర్ కమ్ముల సైలంట్ అయ్యాడు. ఆడియో ఫంక్షన్ కు 30 లక్షలు రూపాయలు ఇస్తే హాజరవుతానని చెప్పిందట. దీంతో అదే ఖర్చుతో ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ జరుపుకోవచ్చని, శేఖర్ కమ్ముల కామ్ గా ఉన్నాడని టాలీవుడ్ టాక్. ఇంకా ఎన్ని రోజులు నయనతార ఇలానే బిహేవ్ చేస్తుందంటూ టాలీవుడ్ లో నయనతారపై కొపం ఉప్పొంగి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: